Tuesday, 28 July 2026 06:36:03 AM
# విద్యార్థుల ఉసురుతీసిన నీట్ కుంభకోణం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని. # రూ.2 కోట్లతో పూర్తయిన సెంట్రల్ లైటింగ్, టూవే లైన్ రోడ్డులో ప్రారంభించిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # అనంతారం గ్రామంలో రైతు సదస్సు, నీటి సంరక్షణ పై అధికారుల అవగాహన. # బొగ్గు ఉత్పత్తి సాధనలో కార్మికుల సమిష్టి కృషి అభినందనీయం. కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ (జీఎం) షాలెం రాజు. # 16వ డివిజన్లో ప్రారంభమైన తొలిముద్ద - బాల భరోసా చిన్నారులకు తొలిముద్ద ను వడ్డిస్తున్న డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # రేగళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆకస్మిక తనిఖీ. ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # మాదకద్రవ్యాల నియంత్రణపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలి: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ . # కొత్తగూడెం ఏరియా జీఎం షాలెంరాజుకు ఘన వీడ్కోలు. పదవీవిరమణ శుభాకాంక్షలు తెలిపిన ఆర్‌సీహెచ్‌పీ అధికారులు, ఉద్యోగులు, కార్మికులు. # జెన్ జీ నీ తెలంగాణ విద్యాశాఖ మంత్రినీ చేయాలి..జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # సుజాతనగర్ మండల సమగ్ర అభివృద్ధికి నిరంతర కృషి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # శ్రీరాముడు కొలువైన జిల్లాలో పనిచేయటం అదృష్టం -సీనియర్ జర్నలిస్ట్ ఎస్ వి సూర్యనారాయణ. # ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # విత్తన మేళాను రైతులు సద్వినియోగం చేసుకోవాలి : వ్యవసాయ శాఖ అధికారి బాబురావు. # ఉమ్మడి ఖమ్మం జిల్లా సమస్యలపై జనసేన పోరాటం. గడల శ్రీనివాసరావు. # దేశ నిర్మాణంలో యువత భాగస్వామ్యం అత్యంత కీలకం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. # ప్రతి మెడికల్ బోర్డు దరఖాస్తుదారుడికి ఇన్వాలిడేషన్ కల్పించాలి-ఎఐటియుసి నేత మిరియాల రంగయ్య డిమాండ్. # విద్యార్థి పోరాటాలకు తలవంచక తప్పదు. ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వర్క అజిత్. # విద్యార్థుల ఐక్య పోరాట ఫలితమే ధర్మేంద్ర ప్రధాన రాజీనామా. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా # భద్రాచలంలో 101 కిలోల డ్రై గంజాయి స్వాధీనం. # వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త ఉన్నత విద్యాసంస్థల బంద్ విజయవంతం.

కార్పొరేట్ మెడికల్ బోర్డు ఫలితాలపై పునఃసమీక్ష చేయాలి-ఎఐటీయూసీ డిమాండ్

Date : 21 July 2026 02:15 PM Views : 231

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : అనారోగ్య కార్మికులకు న్యాయం చెయ్యాలి,మెడికల్ బోర్డును రద్దు చేసి మళ్లీ నిర్వహించాలి వినతిపత్రాలు అందజేసిన ఎఐటీయూసీ నాయకులు. ఈ నెల 17, 18 తేదీల్లో నిర్వహించిన కార్పొరేట్ మెడికల్ బోర్డు ఫలితాలపై పునఃసమీక్ష చేపట్టి బాధిత కార్మికులకు న్యాయం చేయాలని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ (ఎఐటీయూసీ) యాజమాన్యాన్ని డిమాండ్ చేస్తూ.ఎఐటీయూసీ అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య, ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్‌కుమార్ పిలుపు మేరకు మంగళవారం సింగరేణి వ్యాప్తంగా అన్ని మైన్స్, విభాగాల్లో వినతిపత్రాలు సమర్పించారు.పిలుపులో భాగంగా కొత్తగూడెం ఏరియాలోని అన్ని గనులు మరియు విభాగాల్లో ఎఐటీయూసీ నాయకులు వినతిపత్రాలు అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ,సింగరేణి వ్యాప్తంగా సుమారు 2,000 మంది కార్మికులు ఏళ్ల తరబడి మెడికల్ బోర్డు కోసం ఎదురుచూస్తుండగా, కేవలం 120 మందికి మాత్రమే బోర్డు నిర్వహించడం అన్యాయమని పేర్కొన్నారు.వారిలో 28 మంది కార్మికులకు మెడికల్ బోర్డుకు హాజరుకావాల్సిన సమాచారం కూడా సకాలంలో అందకపోవడం యాజమాన్య నిర్లక్ష్యానికి నిదర్శనమని విమర్శించారు.హాజరైన 120 మంది కార్మికుల్లో కేవలం 24 మందిని మాత్రమే ఇన్వాలిడేషన్‌కు అర్హులుగా ప్రకటించడం గతంలో నిర్వహించిన మెడికల్ బోర్డులతో పోలిస్తే అత్యంత తక్కువ శాతమని తెలిపారు.బొగ్గు గనుల్లో, ముఖ్యంగా అండర్‌గ్రౌండ్‌లో దశాబ్దాలుగా పనిచేస్తున్న కార్మికులు కీళ్ల నొప్పులు, వెన్నెముక సమస్యలు, శ్వాసకోశ వ్యాధులు తదితర తీవ్రమైన ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నప్పటికీ, వాటిని సమగ్రంగా పరిగణనలోకి తీసుకోకుండా ఫలితాలు ప్రకటించడం వల్ల నిజంగా అనారోగ్యంతో ఉన్న కార్మికులకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. కావున గతంలో దరఖాస్తు చేసుకుని ఇప్పటికీ మెడికల్ బోర్డు కోసం ఎదురుచూస్తున్న కార్మికులందరికీ తక్షణమే మరోసారి కార్పొరేట్ మెడికల్ బోర్డు నిర్వహించాలని, ప్రతి కార్మికుడి ఆరోగ్య పరిస్థితిని నిష్పాక్షికంగా పరిశీలించి అర్హులైన వారిని ఇన్వాలిడేషన్ చేసి, వారి వారసులకు ఉద్యోగాలు కల్పించి కార్మిక కుటుంబాలకు న్యాయం చేయాలని యాజమాన్యాన్ని ఎఐటీయూసీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బ్రాంచ్ సహాయ కార్యదర్శి గట్టయ్య,ఉపాధ్యక్షులు కత్తర్ల రాములు, ఆఫీస్ బ్యారర్స్ సందబోయిన శ్రీనివాస్,హీరాలాల్,కర్రు రమేష్,గుమ్మడి వీరయ్య,పిట్ కార్యదర్శిలు ఏం ఆర్ కే ప్రసాద్, మధు కృష్ణ, కమల్,సురేందర్, నాయకులు రాజాలపూడి సాంబమూర్తి,బండారి మల్లయ్య ,సాయి పవన్, సందీప్,శశివర్దనరెడ్డి,సురేంద్రరెడ్డి,వెంకటరమణ,కుమార్ రావు,మురళి,అప్పారావు,కొవ్వూరు రాజేశ్వరరావు,అవినాష్,గావినినాగరాజు,సుబ్రమణ్యం,మెంగన్ రవి,కోటి, ఓం ప్రకాష్,తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :