తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : గిరజన చట్టాలను పకడ్బందీగా అమలు చేయాలని ఏజెన్సీ లో 100% ఉద్యోగాలు స్థానిక గిరిజనులతోనే భర్తీ చేయాలనీ తెలంగాణ మంత్రి డాక్టర్ వివేక్ వెంకట స్వామి లంబాడి హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో వినతిపత్రం.ఈ రోజు స్థానిక కొత్తగూడెం పోస్ట్ ఆఫీస్ సెంటర్ వద్ద ఏజెన్సీ చట్టాలను పగడ్బందీగా అమలు చేసి, ఏజెన్సీలో ఘనులు, ఇసుక రీచులు,ఏజెన్సీ ప్రాంతాలలో ఇసుక తవ్వకాలు మరియు విక్రయాలు స్థానిక గిరిజనులతోనే చేపట్టాలని బినామీలపై కఠిన చర్యలు తీసుకోవాలని,1997లో సుప్రీంకోర్టు ఇచ్చిన చారిత్రాత్మక సమతా తీర్పు అమలు చేయాలని. ఏజెన్సీలో 100% ఉద్యోగాలు స్థానిక గిరిజనతోనే భర్తీ చేయాలని తెలంగాణ ప్రభుత్వ కార్మిక, ఉపాధి,శిక్షణ, కర్మాగారాలు, గనులు, భూగర్భ శాఖ మంత్రి డాక్టర్.గడ్డం వివేక్ వెంకట్ స్వామికి కొత్తగూడెం పోస్ట్ ఆఫీస్ సెంటర్ వద్ద లంబడి హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో న్యాయవాది,లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమేష్ నాయక్, LHPS జిల్లా ఇంచార్జ్ భూక్యా మంగిలాల్ నాయక్, మోహన్ నాయక్ సంతోష్ నాయక్, నవీన్ నాయక్ లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ