తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ప్రజలకు కావాల్సిన వైద్యం, రహదారులు, విద్యుత్ వంటి కనీస మౌలిక సదుపాయాలు కల్పించి ప్రతి పల్లెను ప్రగతివైపు పరుగులు పెట్టిస్తానని కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు అన్నారు. లక్ష్మీదేవిపల్లి మండలం హేమచంద్రాపురం, కోరుకొండ, లోతువాగు, ప్రశాంతి నగర్, శేషగిరినగర్, తెలగారమవరం పంచాయతీల పరిధిలోని పలుగ్రామాల్లో రూ.4.29 కోట్ల ఎస్ సి పి, ఎన్ఆర్ఈజిఎస్ పథకాల్లో మంజూరైన నిధులతో చేపట్టనున్న రోడ్లు, డ్రైనేజీలు, ప్రభుత్వ భవనాలు, కల్వర్టుల నిర్మాణ పనులకు శంకుస్థాపన, పూర్తయిన పనులను సోమవారం అయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా,జిల్లా గ్రంధాలయ చైర్మన్ పసుపులేటి. వీరబాబు, పిఏసిఎస్ చైర్మన్ మండే.వీరహనుమంతరావు, కార్యవర్గ సభ్యులు చంద్రగిరి శ్రీనివాసరావు, కంచర్ల జమలయ్య, సిపిఐ మండల కార్యదర్శి దీటి లక్ష్మీపతి, నునవత్ గోవిందు, తూము చౌదరి, పీఏసీఎస్ ఉపాధ్యక్షులు కూచిపూడి జగన్, పూణెo శ్రీనివాస్, అధికారులు అంకుబాబు, శిరీష, శ్రీనివాసరావు, రామకృష్ణ, రఘురామయ్య, వెంకటస్వామి, అమ్మ సాంబయ్య, శివలాల్ తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ