Tuesday, 28 July 2026 09:41:57 AM
# విద్యార్థుల ఉసురుతీసిన నీట్ కుంభకోణం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని. # రూ.2 కోట్లతో పూర్తయిన సెంట్రల్ లైటింగ్, టూవే లైన్ రోడ్డులో ప్రారంభించిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # అనంతారం గ్రామంలో రైతు సదస్సు, నీటి సంరక్షణ పై అధికారుల అవగాహన. # బొగ్గు ఉత్పత్తి సాధనలో కార్మికుల సమిష్టి కృషి అభినందనీయం. కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ (జీఎం) షాలెం రాజు. # 16వ డివిజన్లో ప్రారంభమైన తొలిముద్ద - బాల భరోసా చిన్నారులకు తొలిముద్ద ను వడ్డిస్తున్న డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # రేగళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆకస్మిక తనిఖీ. ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # మాదకద్రవ్యాల నియంత్రణపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలి: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ . # కొత్తగూడెం ఏరియా జీఎం షాలెంరాజుకు ఘన వీడ్కోలు. పదవీవిరమణ శుభాకాంక్షలు తెలిపిన ఆర్‌సీహెచ్‌పీ అధికారులు, ఉద్యోగులు, కార్మికులు. # జెన్ జీ నీ తెలంగాణ విద్యాశాఖ మంత్రినీ చేయాలి..జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # సుజాతనగర్ మండల సమగ్ర అభివృద్ధికి నిరంతర కృషి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # శ్రీరాముడు కొలువైన జిల్లాలో పనిచేయటం అదృష్టం -సీనియర్ జర్నలిస్ట్ ఎస్ వి సూర్యనారాయణ. # ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # విత్తన మేళాను రైతులు సద్వినియోగం చేసుకోవాలి : వ్యవసాయ శాఖ అధికారి బాబురావు. # ఉమ్మడి ఖమ్మం జిల్లా సమస్యలపై జనసేన పోరాటం. గడల శ్రీనివాసరావు. # దేశ నిర్మాణంలో యువత భాగస్వామ్యం అత్యంత కీలకం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. # ప్రతి మెడికల్ బోర్డు దరఖాస్తుదారుడికి ఇన్వాలిడేషన్ కల్పించాలి-ఎఐటియుసి నేత మిరియాల రంగయ్య డిమాండ్. # విద్యార్థి పోరాటాలకు తలవంచక తప్పదు. ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వర్క అజిత్. # విద్యార్థుల ఐక్య పోరాట ఫలితమే ధర్మేంద్ర ప్రధాన రాజీనామా. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా # భద్రాచలంలో 101 కిలోల డ్రై గంజాయి స్వాధీనం. # వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త ఉన్నత విద్యాసంస్థల బంద్ విజయవంతం.

పేదలకు ఆరోగ్య సేవలు అందించడం గొప్ప విషయం, ఎస్పీ రోహిత్ రాజ్

Date : 20 July 2025 03:20 PM Views : 878

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / జూలూరుపాడు : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలై 20 తెలుగు వెలుగు) : జూలూరుపాడు మండల పరిధిలోని నలబండ బోడు గ్రామంలో జూలూరుపాడు ప్రెస్ క్లబ్ సీనియర్స్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఉచిత మెగా ఆరోగ్య శిబిరాన్ని జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ముఖ్య అతిథిగా హాజరై ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నల్లబండబోడు గ్రామంలో నిరుపేదలకు ఆరోగ్య సేవలు అందించడం గొప్ప విషయం అన్నారు. ఇట్టి కార్యక్రమాన్ని ముందుండి నడిపించిన ప్రెస్ క్లబ్ సీనియర్స్ అధ్యక్షుడు కొలిపాక చంద్రశేఖర్ ను మరియు కమిటీ సభ్యులను అభినందించారు ఆపై గ్రామ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ మండలంలోని మారుమూల గ్రామమైన నలబండబోడు గ్రామం గత పది సంవత్సరాల నుండి స్థానిక పోలీస్ స్టేషన్ నందు ఎటువంటి పిటి కేసులు లేకుండా ఉత్తమమైన గ్రామంగా ఉందని గ్రామ ప్రజలను అభినందించారు. గ్రామంలో ప్రతి తల్లిదండ్రులు పిల్లలను మంచిగా చదివించాలని కొంత మేరకు చదువులు చదివించిన ఆ చదువుకు తగ్గ ఉద్యోగాలు మేరకు దగ్గరలో ఉన్న పట్టణాలకు పంపించడం ద్వారా గ్రామంలో ఉన్నటువంటి మిగతా వారంతా చదువుకోవాలని ఆసక్తి పెరిగిద్దని సూచించారు. అడవి ప్రాంతానికి దగ్గరగా ఉన్న గ్రామం కనుక విషపురుగుల నుండి జాగ్రత్తగా ఉండాలని, వర్షాకాలం మొదలైనందున వైరల్ ఇన్ఫెక్షన్స్ సోకకుండా ఉండాలంటే ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచనలు ఇచ్చారు. ఈ వైద్య శిబిరం నకు ఎంతో బిజీగా ఉన్నా పేద ప్రజల కోసం వచ్చినటువంటి డాక్టర్ బాబురావు, డాక్టర్ రాజశేఖర్ అయ్యప్ప, స్త్రీల వైద్య నిపుణులు డాక్టర్ స్రవంతి వారిని మరియు ఫార్మా డిస్ట్రిబ్యూటర్ కాకర్ల రుక్మిణి సమేత సంతాన వేణుగోపాల స్వామి ఆలయ కమిటీ చైర్మన్ ఢిల్లీ వెంకటేశ్వర లను అభినందించారు. ఇక ఈ ఉచిత వైద్య శిబిరం ద్వారా చూయించుకున్న వారు ఈ ఒక్క నెల మందులను వాడి వదిలేయకుండా డాక్టర్లను కలుస్తూ అవసరమున్న మేరకు క్రమం తప్పకుండా ఔషధాలను వాడాలని ప్రజలకు కోరారు. ఈ కార్యక్రమానికి డీఎస్పీ అబ్దుల్ రెహమాన్, జూలూరుపాడు సిఐ ఇంద్రసేనారెడ్డి, ఎస్బిసిఐ శ్రీనివాస్, హెడ్ కానిస్టేబుల్ దయానంద్ మరియు పోలీస్ సిబ్బంది గ్రామ ప్రజలు పాల్గొన్నారు

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :