తెలుగు వెలుగు టీవీ - వార్తలు / జూలూరుపాడు : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జులూరుపాడు మండల కేంద్రంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మంజూరు చేసిన వ్యవసాయ మార్కెట్ నిర్మాణ పనులు తక్షణమే ప్రారంభించాలని, రైతుల నుంచి పత్తి పంటను కనీస మద్దతు ధరకు కొనుగోలు చేయాలని రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర డిమాండ్ చేశారు. బుధవారం బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో జూలూరుపాడు మండల కేంద్రంలోని పత్తి కొనుగోలు సబ్ సెంటర్ ను ఎంపీ రవిచంద్ర స్థానిక నాయకులతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా పలువురు రైతులతో ఆయన మాట్లాడారు. పత్తి పంటకు లభిస్తున్న ధర, సీసీఐ చేపడుతున్న కొనుగోళ్లు, అధికారులు పెడుతున్న ఇబ్బందులు తదితర అంశాల గురించి వారిని అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు రావులపల్లి రాంప్రసాద్, ఎల్లంకి సత్యనారాయణ, లకావత్ గిరిబాబు తదితరులు పాల్గొన్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ