Tuesday, 28 July 2026 02:18:21 AM
# విద్యార్థుల ఉసురుతీసిన నీట్ కుంభకోణం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని. # రూ.2 కోట్లతో పూర్తయిన సెంట్రల్ లైటింగ్, టూవే లైన్ రోడ్డులో ప్రారంభించిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # అనంతారం గ్రామంలో రైతు సదస్సు, నీటి సంరక్షణ పై అధికారుల అవగాహన. # బొగ్గు ఉత్పత్తి సాధనలో కార్మికుల సమిష్టి కృషి అభినందనీయం. కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ (జీఎం) షాలెం రాజు. # 16వ డివిజన్లో ప్రారంభమైన తొలిముద్ద - బాల భరోసా చిన్నారులకు తొలిముద్ద ను వడ్డిస్తున్న డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # రేగళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆకస్మిక తనిఖీ. ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # మాదకద్రవ్యాల నియంత్రణపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలి: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ . # కొత్తగూడెం ఏరియా జీఎం షాలెంరాజుకు ఘన వీడ్కోలు. పదవీవిరమణ శుభాకాంక్షలు తెలిపిన ఆర్‌సీహెచ్‌పీ అధికారులు, ఉద్యోగులు, కార్మికులు. # జెన్ జీ నీ తెలంగాణ విద్యాశాఖ మంత్రినీ చేయాలి..జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # సుజాతనగర్ మండల సమగ్ర అభివృద్ధికి నిరంతర కృషి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # శ్రీరాముడు కొలువైన జిల్లాలో పనిచేయటం అదృష్టం -సీనియర్ జర్నలిస్ట్ ఎస్ వి సూర్యనారాయణ. # ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # విత్తన మేళాను రైతులు సద్వినియోగం చేసుకోవాలి : వ్యవసాయ శాఖ అధికారి బాబురావు. # ఉమ్మడి ఖమ్మం జిల్లా సమస్యలపై జనసేన పోరాటం. గడల శ్రీనివాసరావు. # దేశ నిర్మాణంలో యువత భాగస్వామ్యం అత్యంత కీలకం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. # ప్రతి మెడికల్ బోర్డు దరఖాస్తుదారుడికి ఇన్వాలిడేషన్ కల్పించాలి-ఎఐటియుసి నేత మిరియాల రంగయ్య డిమాండ్. # విద్యార్థి పోరాటాలకు తలవంచక తప్పదు. ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వర్క అజిత్. # విద్యార్థుల ఐక్య పోరాట ఫలితమే ధర్మేంద్ర ప్రధాన రాజీనామా. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా # భద్రాచలంలో 101 కిలోల డ్రై గంజాయి స్వాధీనం. # వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త ఉన్నత విద్యాసంస్థల బంద్ విజయవంతం.

సింగరేణి ఎడ్యుకేషనల్ సొసైటీ ఉద్యోగులకు కూడా రూ.1 కోటి ప్రమాద బీమా వర్తింపు

Date : 23 July 2026 05:17 PM Views : 426

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : సింగరేణి ఎడ్యుకేషనల్ సొసైటీ ఉద్యోగులకు కూడా రూ.1 కోటి ప్రమాద బీమా వర్తింపు – ఏఐటీయూసీ అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య,ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్ వెల్లడి. సింగరేణి సంస్థ పరిధిలోని సింగరేణి ఎడికేషనల్ సొసైటీలో పనిచేస్తున్న ఉద్యోగులకు కూడా కార్పొరేట్ సాలరీ అకౌంట్ ద్వారా అందించే రూ.1 కోటి ప్రమాద బీమా (యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ కవర్) వర్తించేలా సంబంధిత బ్యాంకులు అంగీకరించినట్లు ఏఐటీయూసీ సింగరేణి వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య, ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్‌కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు.వారు మాట్లాడుతూ, కార్పొరేట్ సాలరీ అకౌంట్ కలిగిన ఉద్యోగి ప్రమాదవశాత్తు మరణించిన పక్షంలో సంబంధిత నిబంధనల ప్రకారం అతని కుటుంబానికి రూ.1 కోటి ప్రమాద బీమా ప్రయోజనం అందే విధంగా చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఈ నిర్ణయం సింగరేణి స్కూల్ ఎడికేషనల్ సొసైటీలో ఉద్యోగులకు ఆర్థిక భద్రత కల్పించడంతో పాటు వారి కుటుంబాలకు ఎంతో ఉపశమనం కలిగిస్తుందని తెలిపారు.అదేవిధంగా, సింగరేణి సూపర్ బజార్‌లో పనిచేస్తున్న ఉద్యోగులకు కూడా ఇదే తరహా రూ.1 కోటి ప్రమాద బీమా సౌకర్యం వర్తించేలా గుర్తింపు సంఘం ఏఐటీయూసీ యాజమాన్యం మరియు సంబంధిత బ్యాంకులతో చర్చలు జరుపుతూ నిరంతరం కృషి చేస్తోందని వెల్లడించారు.సింగరేణి సంస్థ పరిధిలో పనిచేస్తున్న ప్రతి ఉద్యోగికి సమాన సంక్షేమ సౌకర్యాలు, భద్రతా పరిరక్షణ మరియు ఆర్థిక రక్షణ కల్పించడమే ఏఐటీయూసీ లక్ష్యమని వారు స్పష్టం చేశారు. ఉద్యోగుల హక్కులు, భద్రత మరియు సంక్షేమం కోసం ఏఐటీయూసీ నిరంతరం పోరాటం కొనసాగిస్తుందని తెలిపారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :