తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : సింగరేణి ఎడ్యుకేషనల్ సొసైటీ ఉద్యోగులకు కూడా రూ.1 కోటి ప్రమాద బీమా వర్తింపు – ఏఐటీయూసీ అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య,ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్ వెల్లడి. సింగరేణి సంస్థ పరిధిలోని సింగరేణి ఎడికేషనల్ సొసైటీలో పనిచేస్తున్న ఉద్యోగులకు కూడా కార్పొరేట్ సాలరీ అకౌంట్ ద్వారా అందించే రూ.1 కోటి ప్రమాద బీమా (యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ కవర్) వర్తించేలా సంబంధిత బ్యాంకులు అంగీకరించినట్లు ఏఐటీయూసీ సింగరేణి వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య, ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు.వారు మాట్లాడుతూ, కార్పొరేట్ సాలరీ అకౌంట్ కలిగిన ఉద్యోగి ప్రమాదవశాత్తు మరణించిన పక్షంలో సంబంధిత నిబంధనల ప్రకారం అతని కుటుంబానికి రూ.1 కోటి ప్రమాద బీమా ప్రయోజనం అందే విధంగా చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఈ నిర్ణయం సింగరేణి స్కూల్ ఎడికేషనల్ సొసైటీలో ఉద్యోగులకు ఆర్థిక భద్రత కల్పించడంతో పాటు వారి కుటుంబాలకు ఎంతో ఉపశమనం కలిగిస్తుందని తెలిపారు.అదేవిధంగా, సింగరేణి సూపర్ బజార్లో పనిచేస్తున్న ఉద్యోగులకు కూడా ఇదే తరహా రూ.1 కోటి ప్రమాద బీమా సౌకర్యం వర్తించేలా గుర్తింపు సంఘం ఏఐటీయూసీ యాజమాన్యం మరియు సంబంధిత బ్యాంకులతో చర్చలు జరుపుతూ నిరంతరం కృషి చేస్తోందని వెల్లడించారు.సింగరేణి సంస్థ పరిధిలో పనిచేస్తున్న ప్రతి ఉద్యోగికి సమాన సంక్షేమ సౌకర్యాలు, భద్రతా పరిరక్షణ మరియు ఆర్థిక రక్షణ కల్పించడమే ఏఐటీయూసీ లక్ష్యమని వారు స్పష్టం చేశారు. ఉద్యోగుల హక్కులు, భద్రత మరియు సంక్షేమం కోసం ఏఐటీయూసీ నిరంతరం పోరాటం కొనసాగిస్తుందని తెలిపారు.
Admin
తెలుగు వెలుగు టీవీ