తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ (SATG) మరియు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు 2nd ఎడిషన్ సీయం కప్ టోర్నమెంట్ లోభాగంగా జిల్లా యువజన మరియు క్రీడల శాఖ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆధ్వర్యంలో సీయం కప్ టార్చ్. ర్యాలి ని పోస్ట్ ఆఫీస్ సెంటర్, కొత్తగూడెం నుండి రైల్వే స్టేషన్ వరకు నిర్వహించడం జరిగింది. టార్చ్ ర్యాలి కు ముఖ్య అతిధిగా విచ్చేసిన కొత్తగూడెం శాసనసభ్యులు కూనం నేని సాంబశివరావు మాట్లాడుతూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు క్రీడల అభివృద్ధి కొరకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తాను అని చెప్పడం జరిగింది. గ్రామా, మండల, నియోజకవర్గ స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయిలో యువతీ, యువకులకు (44) క్రీడాంశాలలో పోటీలు నిర్వహించటం జరుగుతుంది. తెలంగాణాలోని క్రీడాకారులు ఒలింపిక్ స్థాయిలో పతకాలు గెలుపొందాలనే ఉద్దేశంతోనే సీయం కప్ పెట్టడం జరిగింది అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమములో DYSO ఎం.పరందామా రెడ్డి, క్రీడాసంఘాల ప్రతినిధులు యుగెందర్ రెడ్డి, మహిదర్, వెంకటేశ్వర్ రావు, రమేష్, ఖాసిహుస్సేన్, స్వాతిముత్యం, బాబ్ది, జాన్సన్, శ్రీదర్, మొగిలి, రఘు, కోచ్ లు, డానియల్, కళ్యాణ్, మల్లికార్జున్, నాగేందర్, ఆఫీస్ సిబ్బంది తిరుమల్ రావు, లక్ష్మయ్య. క్రీడాకారులు, యువకులు, తదితరులు ఈ కార్యక్రమం పాల్గొని విజయవంతం చేసారు.
Admin
తెలుగు వెలుగు టీవీ