Tuesday, 28 July 2026 12:20:04 PM
# విద్యార్థుల ఉసురుతీసిన నీట్ కుంభకోణం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని. # రూ.2 కోట్లతో పూర్తయిన సెంట్రల్ లైటింగ్, టూవే లైన్ రోడ్డులో ప్రారంభించిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # అనంతారం గ్రామంలో రైతు సదస్సు, నీటి సంరక్షణ పై అధికారుల అవగాహన. # బొగ్గు ఉత్పత్తి సాధనలో కార్మికుల సమిష్టి కృషి అభినందనీయం. కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ (జీఎం) షాలెం రాజు. # 16వ డివిజన్లో ప్రారంభమైన తొలిముద్ద - బాల భరోసా చిన్నారులకు తొలిముద్ద ను వడ్డిస్తున్న డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # రేగళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆకస్మిక తనిఖీ. ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # మాదకద్రవ్యాల నియంత్రణపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలి: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ . # కొత్తగూడెం ఏరియా జీఎం షాలెంరాజుకు ఘన వీడ్కోలు. పదవీవిరమణ శుభాకాంక్షలు తెలిపిన ఆర్‌సీహెచ్‌పీ అధికారులు, ఉద్యోగులు, కార్మికులు. # జెన్ జీ నీ తెలంగాణ విద్యాశాఖ మంత్రినీ చేయాలి..జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # సుజాతనగర్ మండల సమగ్ర అభివృద్ధికి నిరంతర కృషి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # శ్రీరాముడు కొలువైన జిల్లాలో పనిచేయటం అదృష్టం -సీనియర్ జర్నలిస్ట్ ఎస్ వి సూర్యనారాయణ. # ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # విత్తన మేళాను రైతులు సద్వినియోగం చేసుకోవాలి : వ్యవసాయ శాఖ అధికారి బాబురావు. # ఉమ్మడి ఖమ్మం జిల్లా సమస్యలపై జనసేన పోరాటం. గడల శ్రీనివాసరావు. # దేశ నిర్మాణంలో యువత భాగస్వామ్యం అత్యంత కీలకం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. # ప్రతి మెడికల్ బోర్డు దరఖాస్తుదారుడికి ఇన్వాలిడేషన్ కల్పించాలి-ఎఐటియుసి నేత మిరియాల రంగయ్య డిమాండ్. # విద్యార్థి పోరాటాలకు తలవంచక తప్పదు. ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వర్క అజిత్. # విద్యార్థుల ఐక్య పోరాట ఫలితమే ధర్మేంద్ర ప్రధాన రాజీనామా. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా # భద్రాచలంలో 101 కిలోల డ్రై గంజాయి స్వాధీనం. # వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త ఉన్నత విద్యాసంస్థల బంద్ విజయవంతం.

ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను పాటించాలి... ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు , జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్

Date : 19 January 2025 06:54 PM Views : 1013

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలలో భాగంగా ఈ రోజు కొత్తగూడెం సబ్ డివిజన్ పోలీసుల ఆధ్వర్యంలో అవగాహనా సదస్సును ఏర్పాటు చేయడం జరిగింది.ఈ కార్యక్రమాన్ని స్థానిక కొత్తగూడెం క్లబ్ లోని ఫంక్షన్ హాల్ నందు నిర్వహించారు.కొత్తగూడెం డిఎస్పి అబ్దుల్ రెహమాన్ ఆధ్వర్యంలో సబ్ డివిజన్లోని సీఐలు,ఎస్సైలు మరియు సిబ్బంది ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు మరియు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ లు పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో సుమారుగా 300 మంది స్థానికులు పాల్గొన్నారు.ముందుగా ఎస్పీ మాట్లాడుతూ అన్ని శాఖల సమన్వయంతో కొత్తగూడెంలో ట్రాఫిక్ సమస్యను,పార్కింగ్ సమస్యను పరిష్కరించే విధంగా చర్యలు చేపడతామని తెలిపారు.ట్రాఫిక్ సమస్యలను నియంత్రించడంలో పోలీసు వారు చేపట్టే కార్యక్రమాలకు పట్టణ ప్రజలందరూ సహకరించాలని కోరారు.అదే విధంగా జిల్లా ప్రజలందరూ ట్రాఫిక్ నియమ,నిబంధనలు పాటిస్తూ పోలీసు వారికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.అదేవిధంగా కొత్తగూడెం పట్టణంలో ట్రాఫిక్ సమస్యలను అధిగమించేందుకు ముఖ్యమైన ప్రదేశాలలో చేయవల్సిన మార్పుల గురించి,ట్రాఫిక్ సిగ్నల్స్ యొక్క నిరంతర పనితీరు మరియు సీసీ కెమెరాలు ఏర్పాటు గురించి వివరించారు. అదేవిధంగా జిల్లాలో అధికంగా రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రదేశాలను గుర్తించి అక్కడ సంబంధిత శాఖలతో సమన్వయం పాటిస్తూ నివారణా చర్యలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు.అనంతరం కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ జిల్లా ప్రజలందరూ ట్రాఫిక్ నియమాల పట్ల అవగాహన కలిగి ఉండి జిల్లా పోలీస్ శాఖకు సహకరించాలని తెలిపారు.కొత్తగూడెం పట్టణ వ్యాప్తంగా నూతనంగా సీసీ కెమెరాల ఏర్పాటుకు నిధులు సమకూరుస్తామని అన్నారు.వ్యాపారస్తులు,ఆటో డ్రైవర్లు మరియు పట్టణ ప్రజలు ట్రాఫిక్ నియంత్రణలో భాగంగా పోలీస్ వారి సూచనలను పాటించాలని అన్నారు.అన్ని శాఖల వారు సమిష్టిగా ట్రాఫిక్ నియంత్రణ మరియు రోడ్డు ప్రమాదాల నివారణకు కృషి చేయాలని సూచించారు.అనంతరం జాతి రోడ్డు భద్రత మాస ఉత్సవాలకు సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :