తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : సుందరీకరణతో మారనున్న పట్టణ ముఖచిత్రం. ప్రజలకు మేలైన వసతులు అందుబాటులోకి తెస్తున్నాం. ప్రజలకు కనీస మౌలిక వసతులు కల్పించడమే ప్రధాన అజెండా. కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు. రూ.2 కోట్లతో పూర్తయిన సెంట్రల్ లైటింగ్, టూవే లైన్ రోడ్డులో ప్రారంభించిన ఎమ్మెల్యే.పట్టణ పరిధిలో రూ.2 కోట్ల డిఎంఎఫ్ నిధులతో నిర్మించిన భజన మందిర్ రోడ్డు సుందరీకరణ పనులతో ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం అందుబాటులోకి వచ్చిందని కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు తెలిపారు. నూతనంగా ఏర్పాటు చేసిన సెంట్రల్ డివైడర్, టూ వే రోడ్డుతో పాటు సెంట్రల్ లైటింగ్ వ్యవస్థను సోమవారం ఆయన ముఖ్య అతిథిగా హాజరై లాంఛనంగా ప్రారంభించారు. స్విచ్ ఆన్ చేసి వీధి దీపాలను వెలిగించిన అనంతరం ఏర్పాటు చేసిన ప్రారంభోత్సవ సభలో ఎమ్మెల్యే మాట్లాడారు. రోడ్డు విస్తరణ పనుల వల్ల రాకపోకలకు ఎదురవుతున్న తీవ్ర అంతరాయం తొలగిపోతుందని, ముఖ్యంగా రాత్రి వేళల్లో ప్రమాదాల నివారణకు ఈ లైటింగ్ ఎంతగానో ఉపయోగపడుతుందని వివరించారు. పట్టణంలోని పోస్టాఫీస్ సెంటర్ నుంచి గోధుమవాగు వరకు సెంట్రల్ డివైడర్ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసుకున్నామని తెలిపారు. నిధుల వినియోగంలో పారదర్శకత పాటిస్తూ నాణ్యతా ప్రమాణాలతో బూడిదగడ్డ రోడ్డు అభివృద్ధి పనులు పూర్తి చేయడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో పట్టణంలోని అన్ని ప్రధాన రహదారులను మోడల్ రహదారులుగా తీర్చిదిద్దేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. మౌలిక వసతుల కల్పనలో స్థానిక సమస్యలకు ప్రాధాన్యత ఇస్తూ ప్రజలకు అవసరమైన సదుపాయాలు కల్పించడమే ధ్యేయంగా ముందుకు సాగుతామని స్పష్టం చేశారు. మంజూరైన ప్రతి పనిని నిర్ణీత గడువులోగా పూర్తి చేసి ప్రజల వినియోగంలోకి తీసుకురావాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్కె సాబీర్ పాషా, మేయర్ మూడ్ గణేష్, కమిషనర్ సుజాత, కార్పొరేటర్లు, నాయకులు, వాసిరెడ్డి మురళి బోయిన విజయ్ కుమార్, నేరెళ్ల రమేష్, భూక్యా శ్రీనివాస్, యూసఫ్, నిమ్మగడ్డ వెంకటేశ్వరరావు, బండి నరసింహ, కొచ్చర్ల రాకేష్, సాత్విక్, ధనరాజ్, జహీర్, శాంతి ప్రియ, దుర్గయ్య, గడ్డం సతీష్ తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ