Tuesday, 28 July 2026 11:04:16 AM
# విద్యార్థుల ఉసురుతీసిన నీట్ కుంభకోణం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని. # రూ.2 కోట్లతో పూర్తయిన సెంట్రల్ లైటింగ్, టూవే లైన్ రోడ్డులో ప్రారంభించిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # అనంతారం గ్రామంలో రైతు సదస్సు, నీటి సంరక్షణ పై అధికారుల అవగాహన. # బొగ్గు ఉత్పత్తి సాధనలో కార్మికుల సమిష్టి కృషి అభినందనీయం. కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ (జీఎం) షాలెం రాజు. # 16వ డివిజన్లో ప్రారంభమైన తొలిముద్ద - బాల భరోసా చిన్నారులకు తొలిముద్ద ను వడ్డిస్తున్న డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # రేగళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆకస్మిక తనిఖీ. ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # మాదకద్రవ్యాల నియంత్రణపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలి: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ . # కొత్తగూడెం ఏరియా జీఎం షాలెంరాజుకు ఘన వీడ్కోలు. పదవీవిరమణ శుభాకాంక్షలు తెలిపిన ఆర్‌సీహెచ్‌పీ అధికారులు, ఉద్యోగులు, కార్మికులు. # జెన్ జీ నీ తెలంగాణ విద్యాశాఖ మంత్రినీ చేయాలి..జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # సుజాతనగర్ మండల సమగ్ర అభివృద్ధికి నిరంతర కృషి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # శ్రీరాముడు కొలువైన జిల్లాలో పనిచేయటం అదృష్టం -సీనియర్ జర్నలిస్ట్ ఎస్ వి సూర్యనారాయణ. # ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # విత్తన మేళాను రైతులు సద్వినియోగం చేసుకోవాలి : వ్యవసాయ శాఖ అధికారి బాబురావు. # ఉమ్మడి ఖమ్మం జిల్లా సమస్యలపై జనసేన పోరాటం. గడల శ్రీనివాసరావు. # దేశ నిర్మాణంలో యువత భాగస్వామ్యం అత్యంత కీలకం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. # ప్రతి మెడికల్ బోర్డు దరఖాస్తుదారుడికి ఇన్వాలిడేషన్ కల్పించాలి-ఎఐటియుసి నేత మిరియాల రంగయ్య డిమాండ్. # విద్యార్థి పోరాటాలకు తలవంచక తప్పదు. ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వర్క అజిత్. # విద్యార్థుల ఐక్య పోరాట ఫలితమే ధర్మేంద్ర ప్రధాన రాజీనామా. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా # భద్రాచలంలో 101 కిలోల డ్రై గంజాయి స్వాధీనం. # వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త ఉన్నత విద్యాసంస్థల బంద్ విజయవంతం.

సర్ఫస్ కన్వర్షన్‌లో పివికే-5 భూగర్భ గని కార్మికులకే తొలి ప్రాధాన్యత ఇవ్వాలి – ఎఐటియుసి స్పష్టమైన డిమాండ్

Date : 06 July 2026 01:55 PM Views : 226

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఎఐటియుసి పోరాట ఫలితం... సర్ఫస్ జనరల్ అసిస్టెంట్స్ వెబ్ కౌన్సిలింగ్ తాత్కాలికంగా నిలిపివేత. కొత్తగూడెం ఏరియాలో భూగర్భ గనుల్లో విధులు నిర్వహిస్తున్న కార్మికులతోనే సర్ఫస్ కన్వర్షన్ చేపట్టి, ఏరియాలో ఖాళీగా ఉన్న సర్ఫస్ జనరల్ అసిస్టెంట్స్ పోస్టులను భర్తీ చేయాలని గుర్తింపు సంఘం ఎఐటియుసి యాజమాన్యంపై నిరంతరం ఒత్తిడి తీసుకొచ్చింది.ఈ సందర్భంగా ఎఐటియుసి కేంద్ర కార్యదర్శి వంగ వెంకట్ మాట్లాడుతూ, ఈ సమస్యను ఎఐటియుసి గౌరవ అధ్యక్షులు, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య, ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్ యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లి, భూగర్భ గని కార్మికులకు ఎలాంటి అన్యాయం జరగకుండా వెంటనే చర్యలు తీసుకోవాలని కోరినట్లు తెలిపారు.ఎఐటియుసి ఒత్తిడి ఫలితంగా,ఈ నెల 8వ తేదీన నిర్వహించాల్సిన సర్ఫస్ జనరల్ అసిస్టెంట్స్ వెబ్ కౌన్సిలింగ్‌ను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు యాజమాన్యం గుర్తింపు సంఘం ఎఐటియుసికి తెలిపిందన్నారు.అండర్‌గ్రౌండ్ కార్మికుల సర్ఫస్ కన్వర్షన్ అంశాన్ని అత్యంత ప్రాధాన్యంతో పరిశీలించి,మణుగూరు సర్ఫస్ జనరల్ అసిస్టెంట్స్ తో సంబంధం లేకుండా ముఖ్యంగా పివికే-5 భూగర్భ గనిలో విధులు నిర్వహిస్తున్న అర్హులైన కార్మికులకే తొలి ప్రాధాన్యత కల్పించాలని ఎఐటియుసి డిమాండ్ చేసింది. అదేవిధంగా, సర్ఫస్ కన్వర్షన్ ప్రక్రియను ఎలాంటి జాప్యం లేకుండా త్వరితగతిన పూర్తి చేసి, అర్హులైన కార్మికులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని యాజమాన్యాన్ని కోరారు.ఈ కార్యక్రమంలో బ్రాంచ్ కార్యదర్శి వి. మల్లికార్జున్ రావు, కేంద్ర ప్రచార కార్యదర్శి వీరస్వామి, సహాయ కార్యదర్శి గట్టయ్య, ఆఫీస్ బేరర్ హుమాయూన్, నాయకులు లక్ష్మీనారాయణ, సోమయ్య తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :