తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : గుర్తింపు సంఘం ఎఐటియుసి ప్రధాన కార్యదర్శి కొరిమి రాజకుమార్ వెల్లడి. గుర్తింపు సంఘం ఒత్తిడివల్ల గడిచిన 2024 సంవత్సరంలో మైన్స్ మరియు డిపార్ట్మెంట్స్ నందు 190/240 మాస్టర్స్ పూర్తి చేసిన బదిలీవర్కర్లకు ఏరియా వారీగా జనరల్ అసిస్టెంట్ గా క్రమబద్ధీకరణ చేస్తూ వివరాలు వివరాలు వెల్లడించిన యాజమాన్యం.రామగుండం-2: 299 మంది, భూపాలపల్లి: 252 మంది, శ్రీరాంపూర్: 236 మంది, రామగుండం-3 & అడ్రియాల: 167 మంది, రామగుండం-1: 162 మంది, మందమర్రి: 65 మంది, కార్పోరేట్: 21 మంది, కొత్తగూడెం: 21 మంది, మణుగూరు: 18 మంది, బెల్లంపల్లి: 11 మంది, ఇల్లందు: 6 మంది. మొత్తం 1258 మంది బదిలీ వర్కర్లకు జనరల్ అసిస్టెంట్ కేటగిరి-1గా క్రమబద్ధీకరణ లెటర్లు ఇవ్వనున్నట్లు వెల్లడించారు.
Admin
తెలుగు వెలుగు టీవీ