తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాచలంలో 101 కిలోల డ్రై గంజాయి స్వాధీనం.నలుగురు నిందితుల అరెస్ట్ – కారు, ఐదు మొబైల్ ఫోన్లు స్వాధీనం.భద్రాచలం పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం (25-07-2026) మధ్యాహ్నం 2.30 గంటలకు పోలీసులు నిర్వహించిన వాహన తనిఖీలలో భారీగా డ్రై గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. భద్రాచలం పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ (SHO) ఆధ్వర్యంలో పోలీసులు వీరభద్రం ఫంక్షన్ హాల్ సమీపంలో, కూనవరం రోడ్డుపై నిర్వహించిన తనిఖీలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మోతుగూడెం ప్రాంతం నుంచి కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరుకు అక్రమంగా తరలిస్తున్న 101 కిలోల డ్రై గంజాయిని పట్టుకున్నారు.ఈ సందర్భంగా కర్ణాటక రిజిస్ట్రేషన్ నంబర్ KA-03-NR-5892 గల మారుతి ఎర్టిగా కారును, ఐదు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని, గంజాయి అక్రమ రవాణాకు పాల్పడుతున్న నలుగురు నిందితులను అరెస్టు చేశారు.అరెస్టైన నిందితులు:1. సలీం పాషా (53), బొమ్మనహళ్లి, బెంగళూరు దక్షిణ, కర్ణాటక.2. ఈ. రాజేంద్ర ప్రసాద్ (34), నల్లమడ, అనంతపురం జిల్లా, ఆంధ్రప్రదేశ్.3. ఎం.డి. అర్బాజ్ హుస్సేన్ (22), బొమ్మనహళ్లి, బెంగళూరు దక్షిణ, కర్ణాటక.4. ఎస్. గుల్జార్ (35), జయనగర, నెలమంగల, బెంగళూరు గ్రామీణ జిల్లా, కర్ణాటక.ప్రాథమిక విచారణలో నిందితులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మోతుగూడెం నుంచి గంజాయిని భద్రాచలం–ఖమ్మం మార్గం గుండా బెంగళూరుకు రోడ్డు మార్గంలో తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ దాడిలో సీఐ రహీమున్నీసా, ఎస్ఐ సీతారామరాజు, హెడ్ కానిస్టేబుల్ కరీమ్, పోలీసు సిబ్బంది భద్రం, సీతారాం, రాకేష్, రవి పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ