Tuesday, 28 July 2026 04:55:50 PM
# విద్యార్థుల ఉసురుతీసిన నీట్ కుంభకోణం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని. # రూ.2 కోట్లతో పూర్తయిన సెంట్రల్ లైటింగ్, టూవే లైన్ రోడ్డులో ప్రారంభించిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # అనంతారం గ్రామంలో రైతు సదస్సు, నీటి సంరక్షణ పై అధికారుల అవగాహన. # బొగ్గు ఉత్పత్తి సాధనలో కార్మికుల సమిష్టి కృషి అభినందనీయం. కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ (జీఎం) షాలెం రాజు. # 16వ డివిజన్లో ప్రారంభమైన తొలిముద్ద - బాల భరోసా చిన్నారులకు తొలిముద్ద ను వడ్డిస్తున్న డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # రేగళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆకస్మిక తనిఖీ. ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # మాదకద్రవ్యాల నియంత్రణపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలి: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ . # కొత్తగూడెం ఏరియా జీఎం షాలెంరాజుకు ఘన వీడ్కోలు. పదవీవిరమణ శుభాకాంక్షలు తెలిపిన ఆర్‌సీహెచ్‌పీ అధికారులు, ఉద్యోగులు, కార్మికులు. # జెన్ జీ నీ తెలంగాణ విద్యాశాఖ మంత్రినీ చేయాలి..జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # సుజాతనగర్ మండల సమగ్ర అభివృద్ధికి నిరంతర కృషి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # శ్రీరాముడు కొలువైన జిల్లాలో పనిచేయటం అదృష్టం -సీనియర్ జర్నలిస్ట్ ఎస్ వి సూర్యనారాయణ. # ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # విత్తన మేళాను రైతులు సద్వినియోగం చేసుకోవాలి : వ్యవసాయ శాఖ అధికారి బాబురావు. # ఉమ్మడి ఖమ్మం జిల్లా సమస్యలపై జనసేన పోరాటం. గడల శ్రీనివాసరావు. # దేశ నిర్మాణంలో యువత భాగస్వామ్యం అత్యంత కీలకం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. # ప్రతి మెడికల్ బోర్డు దరఖాస్తుదారుడికి ఇన్వాలిడేషన్ కల్పించాలి-ఎఐటియుసి నేత మిరియాల రంగయ్య డిమాండ్. # విద్యార్థి పోరాటాలకు తలవంచక తప్పదు. ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వర్క అజిత్. # విద్యార్థుల ఐక్య పోరాట ఫలితమే ధర్మేంద్ర ప్రధాన రాజీనామా. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా # భద్రాచలంలో 101 కిలోల డ్రై గంజాయి స్వాధీనం. # వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త ఉన్నత విద్యాసంస్థల బంద్ విజయవంతం.

అధిక ధరలను నిరసిస్తూ జూన్ 10న కలెక్టరేట్ ఎదుట ధర్నా. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా.

Date : 03 June 2026 06:11 PM Views : 56

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : అధిక ధరలను నిరసిస్తూ జూన్ 10న కలెక్టరేట్ ఎదుట ధర్నా. ధరల నియంత్రణలో కేంద్రం విఫలం.అడ్డు అదుపులేకుండా పెంచుతున్న ధరలపై ప్రజలు గళం విప్పాలి.ధరలను నియంత్రించేవరకు కేంద్రంపై పోరాటం ఆగదు.ప్రజల్లో మమేకమై స్థానిక సమస్యలను గుర్తించి రాజీలేని పోరాటాలు చేయాలి. ప్రజాసమస్యలు గుర్తించి పరిస్కారానికి కృషిచేయాల్సిన బాధ్యత కార్యకర్తలదే. ఎమ్మెల్యే కూనంనేని కృషితో అభివృద్ధివైపు అడుగులు వేస్తున్న నియోజకవర్గం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా.దేశంలో నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, కార్పొరేట్ శక్తులకు కొమ్ముకాస్తూ సామాన్యుల నడ్డి విరుస్తోందని సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా అన్నారు. జిల్లా కేంద్రంలోని సిపిఐ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన నియోజకవర్గ స్థాయి కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాల వల్ల అడ్డు అదుపులేకుండా పెంచుతున్న ధరలపై ప్రజలు గళం విప్పాలని, అప్పుడే పాలకుల్లో చలనం వస్తుందని ఆయన పిలుపునిచ్చారు. పెరిగిన నిత్యావసరాలు, గ్యాస్, పెట్రోల్, డీజిల్ అధిక ధరలను నిరసిస్తూ జూన్ 10న చేపట్టబోయే కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమాన్ని ప్రజలు, కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. సామాన్య ప్రజలపై మోయలేని భారం మోపుతున్న కేంద్రం తన వైఖరి మార్చుకుని ధరలను నియంత్రించేవరకు కేంద్రంపై పోరాటం ఆగదని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేస్తూ, నాయకులు, కార్యకర్తలు నిరంతరం ప్రజల్లో మమేకమై స్థానిక సమస్యలను గుర్తించి రాజీలేని పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు. క్షేత్రస్థాయిలో ఉన్న ప్రజాసమస్యలు గుర్తించి వాటి పరిస్కారానికి నిరంతరం కృషిచేయాల్సిన బాధ్యత కార్యకర్తలదేనని, ప్రజల పక్షాన నిలబడి పోరాడినప్పుడే పార్టీకి నిజమైన బలం చేకూరుతుందని గుర్తుచేశారు. మరోవైపు కొత్తగూడెం నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కృషితో అభివృద్ధివైపు అడుగులు వేస్తున్న నియోజకవర్గంగా కొత్తగూడెం మారుతోందని, అనేక దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న సమస్యలు ఒక్కొక్కటిగా పరిస్కారంకావడం హర్షణీయమని అన్నారు. సమావేశంలో కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్, జిల్లా కార్యవర్గ సభ్యులు కంచర్ల జమలయ్య, కందుల భాస్కర్, వాసిరెడ్డి మురళి, జిల్లా సమితి సభ్యులు నేరెళ్ల రమేష్, గొనె మని, మునిగడప వెంకటేశ్వర్లు, కొమారి హన్మంతరావు, పట్టణ నాయకులు నిమ్మగడ్డ వెంకటేశ్వరరావు, ఎండి యూసుఫ్, బోయిన విజయ్ కుమార్, ముడెత్తుల శ్రీనివాస్, గోపి కృష్ణ, ధర్మరాజు, సుధాకర్, పల్నాటి ప్రశాంత్, పి ధనలక్ష్మి, వై శంకర్, జహీర్, నగేష్, సత్యనారాయణాచారి, సింగిరాల రమేష్, గడ్డం ప్రభాకర్, ఇమ్రాన్ తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :