తెలుగు వెలుగు టీవీ - వార్తలు / దమ్మపేట : దమ్మపేట మండలం చిన్నగొల్లగూడెంలో సోమవారం భూవివాదం వల్ల ఇరువర్గాల మధ్య గొడవ చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ముత్తారావు, దుర్గయ్య, వెంకన్న, సంజీవరావు, పుల్లారావు అనే అన్నదమ్ములకు సుమారు ఆరు ఎకరాల భూమి ఉంది. వారి భూమి పంపకాల నేపథ్యంలో చెలరేగిన గొడవ దాడికి దారి తీసింది. ఈఘర్షణలో ఇరువర్గాలు కత్తులతో దాడి చేసుకోగా ఐదుగురుకు గాయాలైయ్యాయి. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.
Admin
తెలుగు వెలుగు టీవీ