తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ మార్గదర్శనంలో, ప్రకృతి పరిరక్షణకు భాగస్వాములుగా విద్యార్థులను తీర్చిదిద్దే లక్ష్యంతో, ఇటీవల జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలో విత్తనాల సేకరణ పై ప్రత్యేక కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని ఆచరణాత్మకంగా తీసుకుంటూ రామవరం ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు సేకరించిన విత్తనాలను నేడు గరీబ్ పేట్ రిజర్వ్ అటవీ ప్రాంతంలో జల్లడం జరిగింది. విద్యార్థులు స్థానికంగా సేకరించిన టేకు, చింత, గానుగ, వేప మరియు పనస విత్త నాలను ప్రత్యేకంగా ఎంపిక చేసి వాటిని అటవీ ప్రాంతంలో ప్రకృతి సిద్ధంగా పునరావసం చేయాలని దృష్టితో చల్లారు. వర్షాకాలాన్ని అనుకూలంగా భావించి, విత్తనాల అభివృద్ధికి సహాయకంగా ఉండే ప్రదేశాలను అటవీ శాఖ సహకారంతో గుర్తించి అక్కడ చల్లడం జరిగిందని రామవరం పాఠశాల ప్రధానోపాధ్యాయులు డాక్టర్ ప్రభుదయాల్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు నరేష్ బాబు, శంకర్ మరియు ఇతర సిబ్బందితో పాటు పలువురు విద్యార్థులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ