Tuesday, 28 July 2026 11:56:22 AM
# విద్యార్థుల ఉసురుతీసిన నీట్ కుంభకోణం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని. # రూ.2 కోట్లతో పూర్తయిన సెంట్రల్ లైటింగ్, టూవే లైన్ రోడ్డులో ప్రారంభించిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # అనంతారం గ్రామంలో రైతు సదస్సు, నీటి సంరక్షణ పై అధికారుల అవగాహన. # బొగ్గు ఉత్పత్తి సాధనలో కార్మికుల సమిష్టి కృషి అభినందనీయం. కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ (జీఎం) షాలెం రాజు. # 16వ డివిజన్లో ప్రారంభమైన తొలిముద్ద - బాల భరోసా చిన్నారులకు తొలిముద్ద ను వడ్డిస్తున్న డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # రేగళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆకస్మిక తనిఖీ. ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # మాదకద్రవ్యాల నియంత్రణపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలి: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ . # కొత్తగూడెం ఏరియా జీఎం షాలెంరాజుకు ఘన వీడ్కోలు. పదవీవిరమణ శుభాకాంక్షలు తెలిపిన ఆర్‌సీహెచ్‌పీ అధికారులు, ఉద్యోగులు, కార్మికులు. # జెన్ జీ నీ తెలంగాణ విద్యాశాఖ మంత్రినీ చేయాలి..జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # సుజాతనగర్ మండల సమగ్ర అభివృద్ధికి నిరంతర కృషి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # శ్రీరాముడు కొలువైన జిల్లాలో పనిచేయటం అదృష్టం -సీనియర్ జర్నలిస్ట్ ఎస్ వి సూర్యనారాయణ. # ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # విత్తన మేళాను రైతులు సద్వినియోగం చేసుకోవాలి : వ్యవసాయ శాఖ అధికారి బాబురావు. # ఉమ్మడి ఖమ్మం జిల్లా సమస్యలపై జనసేన పోరాటం. గడల శ్రీనివాసరావు. # దేశ నిర్మాణంలో యువత భాగస్వామ్యం అత్యంత కీలకం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. # ప్రతి మెడికల్ బోర్డు దరఖాస్తుదారుడికి ఇన్వాలిడేషన్ కల్పించాలి-ఎఐటియుసి నేత మిరియాల రంగయ్య డిమాండ్. # విద్యార్థి పోరాటాలకు తలవంచక తప్పదు. ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వర్క అజిత్. # విద్యార్థుల ఐక్య పోరాట ఫలితమే ధర్మేంద్ర ప్రధాన రాజీనామా. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా # భద్రాచలంలో 101 కిలోల డ్రై గంజాయి స్వాధీనం. # వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త ఉన్నత విద్యాసంస్థల బంద్ విజయవంతం.

మహాసభల విజయవంతానికి పల్లెల్లో విస్తృత ప్రచారం

Date : 14 July 2026 05:25 PM Views : 64

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : గిరిజన సమస్యల పరిష్కారానికే రాష్ట్ర మహాసభలు 18న పాల్వంచలో జరిగే ప్రదర్శనకు భారీగా తరలిరావాలి: టిజిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్ తెలంగాణ గిరిజన సమాఖ్య (టిజిఎస్) మూడో రాష్ట్ర మహాసభల విజయవంతానికి ఏజెన్సీ పల్లెల్లో విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నట్లు టిజిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్ తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండల పరిధిలోని బంగారు చెలక. బొజ్జలగూడెం, పాత బంగారుచెలక, పడగాయిగూడెం, లక్ష్మీపురం, చింతకుంట తదితర గిరిజన గ్రామాల్లో మంగళవారం సమాఖ్య నాయకులతో కలిసి ఆయన విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామ సమావేశాలు ఏర్పాటు చేసి మహాసభల ప్రాధాన్యతను వివరించడంతో పాటు ప్రచార కరపత్రాలను పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ నెల 18, 19 తేదీల్లో పాల్వంచ పట్టణంలో జరగనున్న రాష్ట్ర మహాసభలు గిరిజనులు ఎదుర్కొంటున్న పోడు భూముల సమస్యలు, హక్కుల సాధనకు వేదిక కానున్నాయని స్పష్టం చేశారు. ఈ మహాసభలకు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా, సిపిఐ-గిరిజన సమాఖ్య జాతీయ నాయకులు డి అన్నిరాజా, పసుపతి కోల్, రాష్ట్ర నాయకులు అంజయ్య నాయక్, రామ్మూర్తి ముఖ్య అతిథులుగా హాజరవుతున్నట్లు వివరించారు. ఈ ఏజెన్సీ పోరాట మహాసభలను గిరిజనులంతా తరలివచ్చి జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రచార కార్యక్రమంలో వెంకట్, దీటి లక్ష్మీపతి, దారా శ్రీనివాస్, జర్పుల ఉపేందర్, కుంజా రాంబాబు, తాటి లక్ష్మణ్, పరుపర్తి రాజు, జోగా రామయ్య, ఇమామహేశ్వరి, బదియా తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :