Tuesday, 28 July 2026 11:21:53 AM
# విద్యార్థుల ఉసురుతీసిన నీట్ కుంభకోణం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని. # రూ.2 కోట్లతో పూర్తయిన సెంట్రల్ లైటింగ్, టూవే లైన్ రోడ్డులో ప్రారంభించిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # అనంతారం గ్రామంలో రైతు సదస్సు, నీటి సంరక్షణ పై అధికారుల అవగాహన. # బొగ్గు ఉత్పత్తి సాధనలో కార్మికుల సమిష్టి కృషి అభినందనీయం. కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ (జీఎం) షాలెం రాజు. # 16వ డివిజన్లో ప్రారంభమైన తొలిముద్ద - బాల భరోసా చిన్నారులకు తొలిముద్ద ను వడ్డిస్తున్న డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # రేగళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆకస్మిక తనిఖీ. ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # మాదకద్రవ్యాల నియంత్రణపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలి: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ . # కొత్తగూడెం ఏరియా జీఎం షాలెంరాజుకు ఘన వీడ్కోలు. పదవీవిరమణ శుభాకాంక్షలు తెలిపిన ఆర్‌సీహెచ్‌పీ అధికారులు, ఉద్యోగులు, కార్మికులు. # జెన్ జీ నీ తెలంగాణ విద్యాశాఖ మంత్రినీ చేయాలి..జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # సుజాతనగర్ మండల సమగ్ర అభివృద్ధికి నిరంతర కృషి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # శ్రీరాముడు కొలువైన జిల్లాలో పనిచేయటం అదృష్టం -సీనియర్ జర్నలిస్ట్ ఎస్ వి సూర్యనారాయణ. # ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # విత్తన మేళాను రైతులు సద్వినియోగం చేసుకోవాలి : వ్యవసాయ శాఖ అధికారి బాబురావు. # ఉమ్మడి ఖమ్మం జిల్లా సమస్యలపై జనసేన పోరాటం. గడల శ్రీనివాసరావు. # దేశ నిర్మాణంలో యువత భాగస్వామ్యం అత్యంత కీలకం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. # ప్రతి మెడికల్ బోర్డు దరఖాస్తుదారుడికి ఇన్వాలిడేషన్ కల్పించాలి-ఎఐటియుసి నేత మిరియాల రంగయ్య డిమాండ్. # విద్యార్థి పోరాటాలకు తలవంచక తప్పదు. ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వర్క అజిత్. # విద్యార్థుల ఐక్య పోరాట ఫలితమే ధర్మేంద్ర ప్రధాన రాజీనామా. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా # భద్రాచలంలో 101 కిలోల డ్రై గంజాయి స్వాధీనం. # వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త ఉన్నత విద్యాసంస్థల బంద్ విజయవంతం.

గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు వారి ఆరోగ్య పరిరక్షణ. ఐటీడీఏ సహాయ ప్రాజెక్టు అధికారి జనరల్ డేవిడ్ రాజ్.

Date : 30 December 2025 07:46 PM Views : 630

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు వారి ఆరోగ్య పరిరక్షణతో పాటు మెనూ ప్రకారం సమయానుకూలంగా భోజనం అందించి పదవ తరగతి విద్యార్థులపై ఇప్పటి నుండే ప్రత్యేక దృష్టి సారించాలని ఐటీడీఏ సహాయ ప్రాజెక్టు అధికారి జనరల్ డేవిడ్ రాజ్ అన్నారు. మంగళవారం నాడు ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ ఆదేశాల మేరకు లక్ష్మీదేవిపల్లి మండలం రేగళ్ల తండా గిరిజన సంక్షేమ బాలుర ఆశ్రమ పాఠశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి పాఠశాల లోని పరిసరాలు మరియు వంటగది, సామాన్లు నిలువ చేసే స్టోర్ రూమ్, డార్మెటరీ, డైనింగ్ హాల్ పరిశీలించి నూతనంగా ప్రవేశపెట్టిన మెనూ ప్రకారము సమయానుకూలంగా ఆహార పదార్థాలు అందిస్తున్నది లేనిది విద్యార్థులను అడిగి తెలుసుకున్న అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు చదువుతోపాటు మెనూ ప్రకారం మంచి పౌష్టికరమైన ఆహారం అందిస్తున్నందున విద్యార్థులు చదువుపై మాత్రమే దృష్టి పెట్టాలని అన్నారు. చలికాలం నడుస్తున్నందున పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలని రాత్రిపూట విద్యార్థులు ఎవరు బయటకు రాకూడదని, విషపూరితమైన క్రిమి కీటకాలు సంచరించవచ్చని అందుకు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్ఎంకు ఆదేశించారు.ఆశ్రమ పాఠశాలలు, వసతి గృహాలలో చదివే విద్యార్థినీ విద్యార్థులకు ఆరోగ్యరీత్యా ప్రత్యేక వైద్య పరీక్షలు చేయడానికి ఆశ్రమ పాఠశాలలో, వసతి గృహాలలో పనిచేసే ఏఎన్ఎం లకు సరఫరా చేసిన మెడికల్ కిట్లను పరిశీలించి విద్యార్థులు ఎవరైనా విద్యార్థులు అస్వస్థతకు గురి అయితే వెంటనే వైద్య చికిత్సలు అందించాలని ఏఎన్ఎం కు సూచించారు. వంట చేసే సిబ్బంది పరిశుభ్రతను పాటించాలని, వంట చేసిన తర్వాత విద్యార్థులకు సరఫరా చేసేముందు వార్డెన్, హెచ్ఎం, ఉపాధ్యాయులు మరియు పనిచేసే సిబ్బంది తిన్న తర్వాతనే వారికి వడ్డించాలని అన్నారు.విద్యార్థులు హెచ్ఎంకు చెప్పకుండా ఎవరు ఇష్టం వచ్చినట్టు బయటకు వెళ్లకూడదని, ఖాళీ సమయాలలో కెరీర్ గైడెన్స్ కి సంబంధించిన చార్టులు పరిశీలించి భవిష్యత్తులో మీరు ఏ రంగంలో స్థిరపడాలని అనుకుంటున్నారో ఇప్పటినుంచే ప్రిపేర్ కావాలని విద్యార్థులకు సూచించారు. అనంతరం ఉపాధ్యాయులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి పదవ తరగతి విద్యార్థులకు ముఖ్యంగా సబ్జెక్టులలో వెనుక పడ్డ పిల్లల పట్ల ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని, రాత్రిపూట స్టడీ అవర్స్ తప్పనిసరిగా నిర్వహించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం రమేష్, వార్డెన్ కిషన్ మరియు ఉపాధ్యాయులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అదనపు పౌర సంబంధాల అధికారి కార్యాలయము భద్రాచలం నుండి జారీ చేయడమైనది.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :