తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఇంద్రమ్మ చీరలు మహిళలందరికీ ఇవ్వాలి.ఇందిరమ్మ చీరల ఆన్లైన్ డెమోలో మాట్లాడుతున్న కార్పొరేటర్ మునిగడప పద్మ. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇందిరమ్మ చీరల పథకం మొదటి విడత డాక్రా గ్రూప్ మహిళలకె అనటం సరికాదని, 18 నుండి 60 సంవత్సరాలు దాటిన మహిళలందరికీ ఇందిరమ్మ చీరలు పంపిణీ చేయాలని 16 వ డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. గత తెలంగాణ ప్రభుత్వం లో బతుకమ్మ చీరలు 18 సంవత్సరాలు నుండి 60 సంవత్సరాలు దాటిన వారందరికీ ఇచ్చే వారిని అదేవిధంగా ఇందిరమ్మ చీరలు కూడా అలాగే ఇవ్వాలని మహిళలందరూ డిమాండ్ చేస్తున్నట్లు ఆమె తెలిపారు. చీరలు విడతల వారిగా కాకుండా అందరికీ ఒకేసారి ఇస్తే బాగుంటుందని ఈ సందర్భంగా అధికారులకు విజ్ఞప్తి చేశారు. సి ఓ ఉపేందర్, ఆర్ పి కవిత మరియు డ్వాక్రా సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ