Tuesday, 28 July 2026 02:16:14 AM
# విద్యార్థుల ఉసురుతీసిన నీట్ కుంభకోణం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని. # రూ.2 కోట్లతో పూర్తయిన సెంట్రల్ లైటింగ్, టూవే లైన్ రోడ్డులో ప్రారంభించిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # అనంతారం గ్రామంలో రైతు సదస్సు, నీటి సంరక్షణ పై అధికారుల అవగాహన. # బొగ్గు ఉత్పత్తి సాధనలో కార్మికుల సమిష్టి కృషి అభినందనీయం. కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ (జీఎం) షాలెం రాజు. # 16వ డివిజన్లో ప్రారంభమైన తొలిముద్ద - బాల భరోసా చిన్నారులకు తొలిముద్ద ను వడ్డిస్తున్న డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # రేగళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆకస్మిక తనిఖీ. ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # మాదకద్రవ్యాల నియంత్రణపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలి: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ . # కొత్తగూడెం ఏరియా జీఎం షాలెంరాజుకు ఘన వీడ్కోలు. పదవీవిరమణ శుభాకాంక్షలు తెలిపిన ఆర్‌సీహెచ్‌పీ అధికారులు, ఉద్యోగులు, కార్మికులు. # జెన్ జీ నీ తెలంగాణ విద్యాశాఖ మంత్రినీ చేయాలి..జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # సుజాతనగర్ మండల సమగ్ర అభివృద్ధికి నిరంతర కృషి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # శ్రీరాముడు కొలువైన జిల్లాలో పనిచేయటం అదృష్టం -సీనియర్ జర్నలిస్ట్ ఎస్ వి సూర్యనారాయణ. # ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # విత్తన మేళాను రైతులు సద్వినియోగం చేసుకోవాలి : వ్యవసాయ శాఖ అధికారి బాబురావు. # ఉమ్మడి ఖమ్మం జిల్లా సమస్యలపై జనసేన పోరాటం. గడల శ్రీనివాసరావు. # దేశ నిర్మాణంలో యువత భాగస్వామ్యం అత్యంత కీలకం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. # ప్రతి మెడికల్ బోర్డు దరఖాస్తుదారుడికి ఇన్వాలిడేషన్ కల్పించాలి-ఎఐటియుసి నేత మిరియాల రంగయ్య డిమాండ్. # విద్యార్థి పోరాటాలకు తలవంచక తప్పదు. ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వర్క అజిత్. # విద్యార్థుల ఐక్య పోరాట ఫలితమే ధర్మేంద్ర ప్రధాన రాజీనామా. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా # భద్రాచలంలో 101 కిలోల డ్రై గంజాయి స్వాధీనం. # వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త ఉన్నత విద్యాసంస్థల బంద్ విజయవంతం.

కార్పొరేషన్ అభివృద్ధికి ప్రభుత్వం సహకరించాలి.ఉప ముఖ్యమంత్రి భట్టికి వినతిపత్రం అందించిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్.

Date : 23 July 2026 08:53 PM Views : 175

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కార్పొరేషన్ అభివృద్ధికి ప్రభుత్వం సహకరించాలి.అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ పనులుకు నిధులు కేటాయించండి. రోడ్ల విస్తరణ, మౌలిక వసతుల కల్పనలు నిధులు విడుదల చేయండి. ఉప ముఖ్యమంత్రి భట్టికి వినతిపత్రం అందించిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. కార్పొరేషన్ అభివృద్ధికి, మౌలిక వసతుల కల్పనకు నిధులు మంజూరు చేయాలని కోరుతూ ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లుకు గురువారం కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్ వినతిపత్రం అందజేశారు. రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కొత్తగూడెం పర్యటనకు వచ్చిన సందర్భంగా మేయర్ ఆయనను కలిశారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ.. నూతనంగా ఏర్పాటైన కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ప్రజల అవసరాలకు అనుగుణంగా మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. నగరవ్యాప్తంగా అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ (యుజిడి) వ్యవస్థ నిర్మాణానికి అవసరమైన నిధులను మంజూరు చేయాలని కోరారు. పట్టణంలో పెరిగిన రవాణా అవసరాలకు అనుగుణంగా రోడ్ల విస్తరణతో పాటు రోడ్డు మౌలిక వసతుల అభివృద్ధికి ఆర్థిక సహాయం అందించాలని విజ్ఞప్తి చేశారు. ప్రణాళికాబద్ధమైన అభివృద్ధి పనుల ద్వారానే నగర ప్రజల జీవన ప్రమాణాలు మెరుగవుతాయని తెలిపారు. కార్పొరేషన్ ఆరంభ దశలో ఉన్నందున ప్రత్యేక దృష్టి సారించి నిధుల కేటాయింపులో ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. మేయర్ అందించిన వినతిపత్రంపై ఉపముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారని, పనుల నిర్వహణకు తగిన సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారని వెల్లడించారు. మేయర్ వెంట సిపిఐ నాయకులు కార్పొరేటర్లు ఎండియూసు బోయిన విజయకుమార్, గుర్రం వెంకటేశ్వర్లు తదితరులు ఉన్నారు

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :