తెలుగు వెలుగు టీవీ - వార్తలు / జూలూరుపాడు : భద్రాద్రి కొత్తగూడెం జూన్ 21 తెలుగు వెలుగు )జూలూరుపాడు సీపీఐ 13 వ మండల మహాసభ పొన్నెకంటీ వెంకటేశ్వర్లు , యాస రోశయ్య, గుండె పిన్ని మధు అధ్యక్షతన మహాసభ జరిగింది మహాసభల ప్రారంభ సూచికంగా పార్టీ పతాకాన్ని సీనియర్ నాయకులు తూముకోటయ్య ఆవిష్కరించారు . మండల 13వ మహాసభ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన సీపీఐ జాతీయ సమితి సభ్యులు భాగం హేమంతరావు మాట్లాడుతూ మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు పలువురు మావోయిస్టుల ఎన్కౌంటర్లపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం ముందుకు రాకపోతే సుప్రీంకోర్టు ఈ కేసును సుమోటోగా స్వీకరించి న్యాయ విచారణకు ఆదేశించాలన్నారు. ఘటనపై ప్రధాని మోడీ, కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా శత్రుదేశంపై విజయం సాధించిన రీతిలో స్పందించడం విచారకరమని తెలిపారు. స్థానిక ప్రజల హక్కులు, వనరుల దోపిడీకి వ్యతిరేకంగా పోరాటాలు చేస్తున్న వారిని ఏకపక్షంగా ఎన్కౌంటర్ చేయడం సమంజసం కాదని పేర్కొన్నారు. ఇది శాంతి భద్రతలకు విఘాతం కలిగించే చర్యగా చూడాలని అన్నారు. 2026 మార్చి 31 వరకు నక్సలైట్లను అంతముందిస్తామని లక్ష్యంగా పెట్టుకునిమరి ఎన్ కౌంటర్లు చేస్తుండడం, ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే ఎన్ కౌంటర్లకు పాల్పడుతున్న విషయం స్పష్టమవుతుందన్నారు. ఇది ప్రజాస్వామిక హక్కులకు విఘాతం కలిగించే అంశమని, వీటన్నింటినీ పరిగణలోకి తీసుకొని సుప్రీంకోర్టు న్యాయ విచారణ చేపట్టవలసిన అవసరం ఉందని కోరారు. పేద ప్రజలకు ఎర్ర జెండానే భరోసా అని, పేద ప్రజలు, కష్టజీవులు, కర్షకులు, కార్మికుల పార్టీ సిపిఐ అని, సుదీర్ఘ పోరాటాలు, త్యాగాలతో నిర్మితమైన ఎర్ర జెండా పార్టీకి ఎదురులేదని, మరో వందేళ్లైనా చెక్కు చెదరకుండా అజేయంగా నిలుస్తుందని, నిరంతరం సమరశీల పోరాటాలు సాగిస్తున్న సిపిఐ ఒక ప్రాంతానికో, ఒక వర్గానికో పరిమితమైన పార్టీ కాదని స్పష్టం చేశారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని, ప్రతి పంచాయతీలో సిపిఐ ప్రాతినిధ్యం ఉండే విధంగా ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధంగా చేసుకోవాలని పిలుపునిచ్చారు. అనంతరం సీపీఐ జిల్లా కార్యదర్శి sk, షాబీర్ పాషా మాట్లాడుతూ దోపిడీ, అణచివేతకు గురవుతూ దుర్భరజీవితం గడుపుతున్న ఏజెన్సీ పల్లె ప్రజల జీవన ప్రమాణాల మార్పుకు నంది పలికి ఆధునికతవైపు నడిపించింది ఎర్ర జెండానేనని, అసమానతలు లేని సమాజ నిర్మాణమే కమ్యూనిస్టుల అంతిమ లక్ష్యమని, అన్యాయం, దోపిడీ, అణచివేతలున్నంతకాలం ఎర్రజెండా ఉంటుందని స్పష్టం చేశారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పై కమ్యూనిస్టు పార్టీ ప్రజల పక్షాన ఉంటుందని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరారు.ఈ మహాసభలో సిపిఐ వైరా నియోజకవర్గ కన్వీనర్ ఎర్ర బాబు సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు చంద్ర నరేంద్ర కుమార్ సీపీఐ మండల కార్యదర్శి గుండె పిన్ని వెంకటేశ్వర్లు, చండ్రుగొండ మండల కార్యదర్శి బోర కేశవులు, సిపిఐ కొత్తగూడెం నియోజకవర్గం నాయకులు నేరెళ్ల రమేష్, సిపిఐ నాయకులు ఎస్కే నాగుల్ మీరా, ఎల్లంకి మధు, ఎస్కే చాంద్ పాషా, సిరిపూరపువెంకటేశ్వర్లు బెజవాడ సీతయ్య ముత్తయ్య ఉదారి నాగయ్య పొన్నగంటి వెంకటేశ్వర్లు కొండ వీరయ్య తదితరులు పాల్గొన్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ