Tuesday, 28 July 2026 08:05:06 AM
# విద్యార్థుల ఉసురుతీసిన నీట్ కుంభకోణం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని. # రూ.2 కోట్లతో పూర్తయిన సెంట్రల్ లైటింగ్, టూవే లైన్ రోడ్డులో ప్రారంభించిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # అనంతారం గ్రామంలో రైతు సదస్సు, నీటి సంరక్షణ పై అధికారుల అవగాహన. # బొగ్గు ఉత్పత్తి సాధనలో కార్మికుల సమిష్టి కృషి అభినందనీయం. కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ (జీఎం) షాలెం రాజు. # 16వ డివిజన్లో ప్రారంభమైన తొలిముద్ద - బాల భరోసా చిన్నారులకు తొలిముద్ద ను వడ్డిస్తున్న డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # రేగళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆకస్మిక తనిఖీ. ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # మాదకద్రవ్యాల నియంత్రణపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలి: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ . # కొత్తగూడెం ఏరియా జీఎం షాలెంరాజుకు ఘన వీడ్కోలు. పదవీవిరమణ శుభాకాంక్షలు తెలిపిన ఆర్‌సీహెచ్‌పీ అధికారులు, ఉద్యోగులు, కార్మికులు. # జెన్ జీ నీ తెలంగాణ విద్యాశాఖ మంత్రినీ చేయాలి..జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # సుజాతనగర్ మండల సమగ్ర అభివృద్ధికి నిరంతర కృషి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # శ్రీరాముడు కొలువైన జిల్లాలో పనిచేయటం అదృష్టం -సీనియర్ జర్నలిస్ట్ ఎస్ వి సూర్యనారాయణ. # ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # విత్తన మేళాను రైతులు సద్వినియోగం చేసుకోవాలి : వ్యవసాయ శాఖ అధికారి బాబురావు. # ఉమ్మడి ఖమ్మం జిల్లా సమస్యలపై జనసేన పోరాటం. గడల శ్రీనివాసరావు. # దేశ నిర్మాణంలో యువత భాగస్వామ్యం అత్యంత కీలకం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. # ప్రతి మెడికల్ బోర్డు దరఖాస్తుదారుడికి ఇన్వాలిడేషన్ కల్పించాలి-ఎఐటియుసి నేత మిరియాల రంగయ్య డిమాండ్. # విద్యార్థి పోరాటాలకు తలవంచక తప్పదు. ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వర్క అజిత్. # విద్యార్థుల ఐక్య పోరాట ఫలితమే ధర్మేంద్ర ప్రధాన రాజీనామా. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా # భద్రాచలంలో 101 కిలోల డ్రై గంజాయి స్వాధీనం. # వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త ఉన్నత విద్యాసంస్థల బంద్ విజయవంతం.

గిరిజన ప్రాంతాల్లో నాణ్యమైన వైద్య సేవలు అందించడం గర్వకారణం : జిల్లా కలెక్టర్ అంకిత్

Date : 11 April 2026 03:39 PM Views : 125

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : సమన్వయంతోనే జిల్లాకు రాష్ట్రస్థాయి అవార్డులు – వైద్య శాఖకు కలెక్టర్ అభినందనలు ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా చేపట్టిన 99 రోజుల కార్యాచరణ కార్యక్రమాల్లో ఒక భాగంగా జిల్లా వైద్య విధానం పరిషత్ ఆసుపత్రుల సిబ్బందికి ప్రశంస పత్రాల ప్రదానోత్సవ కార్యక్రమాన్ని శనివారం పాల్వంచ పెద్దమ్మ గుడి సమీపంలోని ఫంక్షన్ హాల్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ అంకిత్ ముఖ్య అతిథిగా హాజరై, వైద్య సిబ్బందికి ప్రశంస పత్రాలు అందజేసి, వారి సేవలను ప్రశంసించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, గిరిజన ప్రాంతంగా ఉన్న జిల్లాలో నాణ్యమైన వైద్య సేవలను అందించడం ఎంతో సవాలుతో కూడుకున్నదైనా, జిల్లా వైద్య సిబ్బంది అంకితభావంతో పనిచేసి రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందడం అభినందనీయమని తెలిపారు. మారుమూల ఏజెన్సీ ప్రాంతాలు ఎక్కువగా ఉన్న ఈ జిల్లాలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందించడం ద్వారా ప్రజల ఆరోగ్య స్థితిని మెరుగుపరచడంలో వైద్య శాఖ కీలక పాత్ర పోషిస్తోందని అన్నారు . గతంలో మారుమూల గ్రామాలకు సరైన రహదారి, కమ్యూనికేషన్ సదుపాయాలు లేకపోవడం వల్ల వైద్య సేవలను సమర్థవంతంగా అందించడంలో అనేక సమస్యలు ఎదురయ్యాయని గుర్తుచేశారు. అయితే ప్రస్తుతం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం విస్తృతంగా అందుబాటులోకి రావడంతో చర్ల, గుండాల వంటి దూర ప్రాంతాల్లో కూడా అత్యాధునిక వైద్య సేవలను అందించడం సాధ్యమైందని తెలిపారు. టెలీమెడిసిన్, డిజిటల్ కనెక్టివిటీ, మొబైల్ వైద్య సేవల ద్వారా ప్రజలకు సమయానికి చికిత్స అందించడం సాధ్యమవుతోందని చెప్పారు. ఈ విజయానికి ఆశా కార్యకర్తల నుండి ఏఎన్ఎంలు, స్టాఫ్ నర్సులు, వైద్యులు, జిల్లా స్థాయి అధికారులు వరకు అందరి సమన్వయం ముఖ్య కారణమని కలెక్టర్ అన్నారు . ప్రతి ఒక్కరు తమ తమ బాధ్యతలను నిబద్ధతతో నిర్వర్తించడం వల్లనే జిల్లాకు రాష్ట్ర స్థాయిలో అత్యున్నత అవార్డులు లభించాయని తెలిపారు. ఇది జిల్లాకు గర్వకారణమని అన్నారు. జిల్లా వైద్య శాఖ ఇదే ఉత్సాహంతో ముందుకు సాగి, రాబోయే రోజుల్లో రాష్ట్ర స్థాయితో పాటు దేశ స్థాయిలో కూడా అగ్రస్థానంలో నిలిచేలా కృషి చేయాలని కలెక్టర్ సూచించారు. వైద్య సేవల నాణ్యతను మరింత మెరుగుపరచడంతో పాటు, ప్రతి పల్లె, ప్రతి గిరిజన ప్రాంతానికి ఆరోగ్య సేవలు చేరేలా చర్యలు తీసుకోవాలని అన్నారు . ప్రస్తుత సంవత్సరంలో సాధించిన విజయాలను కొనసాగిస్తూ, వచ్చే సంవత్సరం కూడా మరిన్ని ప్రతిష్టాత్మక అవార్డులు జిల్లాకు తీసుకురావాలని వైద్య సిబ్బందిని ప్రోత్సహించారు. సేవా భావంతో పనిచేసే వైద్య సిబ్బంది వల్లే ప్రజల నమ్మకం పెరుగుతుందని, ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవడం అత్యంత ముఖ్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో డిసిహెచ్ రవిబాబు, తాసిల్దార్ దారా ప్రసాద్, ఆసుపత్రుల సూపర్డెంట్లు, వైద్యులు, నర్సులు, సిబ్బంది సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :