Tuesday, 28 July 2026 09:50:18 AM
# విద్యార్థుల ఉసురుతీసిన నీట్ కుంభకోణం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని. # రూ.2 కోట్లతో పూర్తయిన సెంట్రల్ లైటింగ్, టూవే లైన్ రోడ్డులో ప్రారంభించిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # అనంతారం గ్రామంలో రైతు సదస్సు, నీటి సంరక్షణ పై అధికారుల అవగాహన. # బొగ్గు ఉత్పత్తి సాధనలో కార్మికుల సమిష్టి కృషి అభినందనీయం. కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ (జీఎం) షాలెం రాజు. # 16వ డివిజన్లో ప్రారంభమైన తొలిముద్ద - బాల భరోసా చిన్నారులకు తొలిముద్ద ను వడ్డిస్తున్న డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # రేగళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆకస్మిక తనిఖీ. ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # మాదకద్రవ్యాల నియంత్రణపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలి: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ . # కొత్తగూడెం ఏరియా జీఎం షాలెంరాజుకు ఘన వీడ్కోలు. పదవీవిరమణ శుభాకాంక్షలు తెలిపిన ఆర్‌సీహెచ్‌పీ అధికారులు, ఉద్యోగులు, కార్మికులు. # జెన్ జీ నీ తెలంగాణ విద్యాశాఖ మంత్రినీ చేయాలి..జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # సుజాతనగర్ మండల సమగ్ర అభివృద్ధికి నిరంతర కృషి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # శ్రీరాముడు కొలువైన జిల్లాలో పనిచేయటం అదృష్టం -సీనియర్ జర్నలిస్ట్ ఎస్ వి సూర్యనారాయణ. # ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # విత్తన మేళాను రైతులు సద్వినియోగం చేసుకోవాలి : వ్యవసాయ శాఖ అధికారి బాబురావు. # ఉమ్మడి ఖమ్మం జిల్లా సమస్యలపై జనసేన పోరాటం. గడల శ్రీనివాసరావు. # దేశ నిర్మాణంలో యువత భాగస్వామ్యం అత్యంత కీలకం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. # ప్రతి మెడికల్ బోర్డు దరఖాస్తుదారుడికి ఇన్వాలిడేషన్ కల్పించాలి-ఎఐటియుసి నేత మిరియాల రంగయ్య డిమాండ్. # విద్యార్థి పోరాటాలకు తలవంచక తప్పదు. ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వర్క అజిత్. # విద్యార్థుల ఐక్య పోరాట ఫలితమే ధర్మేంద్ర ప్రధాన రాజీనామా. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా # భద్రాచలంలో 101 కిలోల డ్రై గంజాయి స్వాధీనం. # వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త ఉన్నత విద్యాసంస్థల బంద్ విజయవంతం.

రాజమండ్రి శిక్షణకు 11 సీట్లు - అవకాశాన్ని వినియోగించుకోవాలని వడ్రంగి/కార్పెంటర్ సంఘ పెద్దలకు సూచన : జిల్లా కలెక్టర్

Date : 07 November 2025 03:53 PM Views : 442

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్‌లో శుక్రవారం, జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్, వడ్రంగి (కార్పెంటర్) సంఘ పెద్దలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఫర్నిచర్ రంగంలో నైపుణ్యం కలిగిన యువతకు లభిస్తున్న అవకాశాలను వివరించి, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రాజమండ్రిలో ఈ సోమవారం నుండి ప్రారంభమయ్యే రెసిడెన్షియల్ ఫర్నిచర్ అసిస్టెంట్ శిక్షణ కోసం 11 సీట్లు అందుబాటులో ఉన్నట్లు కలెక్టర్ తెలిపారు. దీనికి సంబంధించి శనివారం (రేపు) ఉదయం 10 గంటలకు కలెక్టరేట్‌లోని S-20 గదిలో ఒరియంటేషన్ మరియు ఎంపిక పరీక్ష నిర్వహించబడుతుందని తెలిపారు. శిక్షణకు ఎంపికయ్యే అభ్యర్థులకు: ఒక్కొక్కరికి రూ. 5,000 రిజిస్ట్రేషన్ ఫీజును జిల్లా యంత్రాంగం భరిస్తుందని, వసతి మరియు భోజనం పూర్తిగా ఉచితంగా ఆ సంస్థ ద్వారా కల్పించబడుతుందని తెలిపారు. శిక్షణ పూర్తయ్యిన వెంటనే రూ. 15,000/- స్తాయిలో 6 నెలల అప్రెంటిస్‌షిప్ అవకాశాన్ని కూడా కల్పిస్తారని, అనంతరం 100% ప్లేస్మెంట్ అదే సంస్థలోనే కల్పిస్టారని పేర్కొన్నారు. ఇప్పటికే జిల్లాలో NSTI–FFSC ఆధ్వర్యంలో మొదటి విడతలో 8 మంది శిక్షణ పూర్తి చేసుకుని అప్రెంటిస్‌షిప్‌లో ఉన్నారని, రెండవ విడతలో 19 మంది అభ్యర్థులను గురువారం ఎంపిక చేసినట్లు కలెక్టర్ తెలిపారు. రాజమండ్రి శిక్షణ కోసం ఇంకా 11 మందిని శనివారం ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని వడ్రంగి/కార్పెంటర్ యువతతో పాటు ఆసక్తి ఉన్న ఇతర యువత కూడా వినియోగించుకోవాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :