తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : మస్జిద్ ఏ రహీం ఖురేషి కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం నమాజ్ అనంతరం పహల్గం పర్యాటకులపై భారతీయులపై పాక్ పేరేపీత ఉగ్రదాడిని నిరసిస్తూ ఉగ్ర దాడిలో మరణించిన భారతీయులకు నివాళులు అర్పించారు అనంతరం ముస్లిం మైనారిటీ నాయకులు ఫహీమ్ దాదా మాట్లాడుతూ దేశ ఐక్యత దేశ పరిరక్షణ ముఖ్యమని భావిస్తూ కుల మతాలకతీతంగా జీవిస్తున్న భారతదేశంలో ఉగ్రవాదాన్ని అణిచివేయాలని ఉగ్రవాదం లేని భారతదేశంకావాలని అన్నారు ఉగ్రవాదాన్ని మట్టి కల్పించే విధంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, మృతి చెందిన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపి రెండు నిమిషాలు మౌనం పాటించారు అదేవిధంగా ఉగ్ర దాడిలో గాయపడ్డ భారతీయులు త్వరగా కోలుకోవాలని ప్రార్థన చేశారు... ఉగ్రవాదులు మతం పేరుతో మానవత్వం మంటగలిపే చర్యలు మంచిది కాదన్నారు అమాయక ప్రజల ప్రాణాలు తీసుకోవడం జీర్ణించలేకపోతున్నామని, సమాజంలో ఎవరు ఎవరి ప్రాణాలు తీసే హక్కు లేదని, భారతదేశంలో ఇటువంటి సమస్య వచ్చినప్పుడు కుల మతాలకు అతీతంగా అందరూ కలిసి నిలబడాలని పాకిస్తాన్ వెన్నులో భయం కలిగే విధంగా మనమందరం కలిసి పోరాడాలని పహాల్గంలో పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులను పాకిస్తాన్ భారత ప్రభుత్వానికి అప్పగించాలని లేనిపక్షంలో పాకిస్తాన్తో ఉన్న ఒప్పందాలు రద్దు చేసుకొని పాకిస్తాన్ రాక్షసులపై యుద్ధం చేయడానికి అయినా కేంద్ర ప్రభుత్వం సిద్ధం కావాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో, ఖయ్యుమ్,జమీల్, షఫీ,యూసుఫ్, జలీల్, అజీజ్,జానీ,రసూల్,అజీమ్,హబీబ్,అఫ్రోజ్, రహీం, అలీం, లతీఫ్, బాజీ,వసీమ్, అమాన్, అషు,అల్తాఫ్, షబ్బీర్, సలీం,తదితరులు పాల్గొన్నారు...
Admin
తెలుగు వెలుగు టీవీ