తెలుగు వెలుగు టీవీ - వార్తలు / జూలూరుపాడు : భద్రాద్రి కొత్తగూడెం డిసెంబర్ 25 తెలుగు వెలుగు) జూలూరుపాడు మండలంలో మాజీ ప్రధాని భారతరత్న అటల్ బిహారి వాజ్పాయ్ శతజయంతి సందర్భంగా కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో వాజ్పేయికి చిత్రపటానికి పూలమాల వేసి శతజయంతి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగినది. అనంతరం రామాలయం వీధిలో స్వచ్ఛభారత్ నిర్వహించడం జరిగినది. ఈ సందర్భంగా కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శి చిలుకూరి రమేష్ మాట్లాడుతూ మాజీ ప్రధానమంత్రి,(భారతరత్న)వాజ్పేయి పేద ప్రజల కోసం అంతోదయ పథకాన్ని కుటుంబానికి 35 కేజీల బియ్యం ప్రవేశపెట్టినారు, గ్రామీణ ప్రాంతాలకు సడక్ యోజన కింద గ్రామాలకు లింకు రోడ్లు, మరియు హైవే రోడ్లు, గ్రామాల్లో తాగునీరుకు, సాగునీరుకు, అత్యధిక ప్రాధాన్యత ఇచ్చినారు, ఆరోజు దేశఆర్థిక పరిస్థితి బాగోలేదు అయినా కూడా వాజ్పేయి ఎంతో చాకచక్యంగా వ్యవహరించి దేశాన్ని అభివృద్ధి చేసినారు.
ప్రపంచంలోనే అరుదైన నాయకుడు నీతి నిజాయితీతో సుపరిపాలన అందించినారు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా వాజ్పేయి ఆశయాలు అనుకూలంగా పనిచేస్తున్నారు మనమందరం కూడా వాజ్పాయ్ ఆశయాలకు అనుకూలంగా పని చేద్దామని బిజెపి కిసాన్ మోర్చా రాష్ట్ర చిలుకూరి రమేష్ అన్నారు. ఈ కార్యక్రమంలో కిసాన్ మోర్చా ఉపాధ్యక్షులు మాదినేని సతీష్, ఆదివాసి జిల్లా అధ్యక్షుడు తెల్లం నరసింహారావు, బిజెపి మండల అధ్యక్షుడు సిరిపురపు ప్రసాద్, కిసాన్ మోర్చా మండల ప్రధాన కార్యదర్శి సిరిపురపు పుల్లారావు, గోపాల్ రావు, పురేటి వెంకటేశ్వర్లు, శ్రీను, చిలుకూరి కిరణ్,వందనపు సుబ్బు, తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ