తెలుగు వెలుగు టీవీ - వార్తలు / జూలూరుపాడు : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 99 రోజుల ప్రజా పాలన -ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా జూలూరుపాడు మండలం అనంతారం గ్రామ పంచాయతీ లో జరిగిన గ్రామ సభకు వైరా శాసనసభ్యులు మాలోత్ రాందాస్ నాయక్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజా సమస్యలు పరిష్కారానికై ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాల ద్వారా ప్రతి పంచాయతీలో గ్రామసభలు నిర్వహిస్తున్న మని అన్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను నేరుగా తెలుసుకొని పరిష్కరించేందుకు గ్రామ సభలు కీలక వేదికలుగా మారుతున్నాయని తద్వారా అర్హులైన వారందరికీ ప్రభుత్వం అందించే పథకాలు అందుతాయని అన్నారు. అనంతారం గ్రామపంచాయతీని ఉద్దేశించి మాట్లాడుతూ మండలంలోని అనంతారం గ్రామాన్ని పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు అందజేశామని, త్వరలో సాగులో ఉన్న పోడు భూములకు పట్టాలు ఇప్పించి ఇంద్ర జలప్రభ ద్వారా మోటార్లు విద్యుత్ లైన్లు అందిస్తామని అన్నారు. ఈ కార్యక్రమానికి జూలూరుపాడు తాసిల్దార్ టి శ్రీనివాసరావు, మండల అభివృద్ధి అధికారి తాళ్లూరి రవి, ఎంపీవో తులసిరామ్,మండల వ్యవసాయ అధికారి దీపక్ ఆనంద్, పీహెచ్సీ వైద్యులు వెంకటేశ్వర్లు, ఎఫ్ ఆర్ వో ప్రసాద్ రావు, పంచాయతీ కార్యదర్శి జి సైలజ, సర్పంచ్ కొరస రమేష్, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు లేళ్ల వెంకటరెడ్డి, మండల అధ్యక్షుడు మంగీలాల్ పంచాయతీ వార్డు మెంబర్లు మరియు పంచాయతీ ప్రజలు పాల్గొన్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ