తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : లయన్స్ క్లబ్ ఆఫ్ కొత్తగూడెం వికాస తరంగిణి ఆధ్వర్యంలో శ్రీనగర్ కాలనీ లో మెగా ఉచిత కంటి పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేశారు ఈ ఉచిత కంటి పరీక్ష కేంద్రం ప్రారంభోత్సవానికిముఖ్య అతిథిగా కొత్తగూడెం శాసనసభ్యులు శ్రీ కూనంనేని సాంబశివరావు విచ్చేశారు. వారు మాట్లాడుతూ స్వచ్ఛంద సంస్థలు సామాజిక సేవా కార్యక్రమాల్లో ముందుంటారని ముఖ్యంగా ఈరోజు లయన్స్ క్లబ్ ఆఫ్ కొత్తగూడెం వికాస తరంగాణి ఆధ్వర్యంలో ఉచిత కంటి పరీక్షల నిర్వహణ , పరీక్షల అనంతరం ఉచితంగా సుమారు 200 మందికి పరీక్షలు జరిపి పదిమంది కి ఆపరేషన్ నిమిత్తం ఖమ్మం శరత్ మ్యాక్సీవిజన్ హాస్పిటల్ కి హాస్పిటల్ వైద్య బృందం తీసుకువెళ్లడం జరిగింది. ఆపరేషన్లు జరపడం అభినందనీయమని శరత్ మాక్సివిజన్ హాస్పిటల్ యాజమాన్యానికి సిబ్బందికి అభినందనలు తెలియజేస్తూ రానున్న రోజుల్లో మారుమూల ఏజెన్సీ గ్రామాల్లో ఇంకా సేవలందించాలని పిలుపునిచ్చారు. సమాజానికి ఉపయోగపడే ప్రతి కార్యక్రమంలో స్వచ్ఛంద సంస్థలను రానున్న రోజుల్లో భాగస్వామ్యం అవుతామనిఈ సందర్భంగా తెలియజేశారు. కొత్తగూడెం నియోజకవర్గం అభివృద్ధిలో ఎంతో కృషి చేస్తున్నానని మరింత అభివృద్ధి దిశగా ప్రణాళికలు సిద్ధం చేశానని నియోజకవర్గ ప్రజల ప్రతి సమస్యలో వాటిని పరిష్కరించడంలో ముందుంటానని నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి తన లక్ష్యమని తెలియజేశారు. లయన్స్ క్లబ్ ఆఫ్ కొత్తగూడెం అధ్యక్షులు లగడపాటి రమేష్ చంద్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ కంచర్ల చంద్రశేఖర రావు కొత్తగూడెం క్లబ్ కార్యదర్శి సీనియర్ లయన్ కోనేరు పూర్ణచందర్రావు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సిపిఐ కార్యదర్శి ఎస్ కే సాబీర్ పాషా లయన్స్ క్లబ్ ఆఫ్ కొత్తగూడెం సభ్యులు మొరిశెట్టి మోహన్ రావు కూర శ్రీధర్ Congrats జయకుమార్,వర్ధన్ రావు,కోనేరు నాగేశ్వరరావు, వికాస తరంగిణి సభ్యులు రమాదేవి, షాబు వెంకటేశ్వర్లు,శరత్ మాక్స్ విజన్ వైద్య బృందం పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ