Tuesday, 28 July 2026 01:24:36 PM
# విద్యార్థుల ఉసురుతీసిన నీట్ కుంభకోణం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని. # రూ.2 కోట్లతో పూర్తయిన సెంట్రల్ లైటింగ్, టూవే లైన్ రోడ్డులో ప్రారంభించిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # అనంతారం గ్రామంలో రైతు సదస్సు, నీటి సంరక్షణ పై అధికారుల అవగాహన. # బొగ్గు ఉత్పత్తి సాధనలో కార్మికుల సమిష్టి కృషి అభినందనీయం. కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ (జీఎం) షాలెం రాజు. # 16వ డివిజన్లో ప్రారంభమైన తొలిముద్ద - బాల భరోసా చిన్నారులకు తొలిముద్ద ను వడ్డిస్తున్న డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # రేగళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆకస్మిక తనిఖీ. ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # మాదకద్రవ్యాల నియంత్రణపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలి: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ . # కొత్తగూడెం ఏరియా జీఎం షాలెంరాజుకు ఘన వీడ్కోలు. పదవీవిరమణ శుభాకాంక్షలు తెలిపిన ఆర్‌సీహెచ్‌పీ అధికారులు, ఉద్యోగులు, కార్మికులు. # జెన్ జీ నీ తెలంగాణ విద్యాశాఖ మంత్రినీ చేయాలి..జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # సుజాతనగర్ మండల సమగ్ర అభివృద్ధికి నిరంతర కృషి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # శ్రీరాముడు కొలువైన జిల్లాలో పనిచేయటం అదృష్టం -సీనియర్ జర్నలిస్ట్ ఎస్ వి సూర్యనారాయణ. # ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # విత్తన మేళాను రైతులు సద్వినియోగం చేసుకోవాలి : వ్యవసాయ శాఖ అధికారి బాబురావు. # ఉమ్మడి ఖమ్మం జిల్లా సమస్యలపై జనసేన పోరాటం. గడల శ్రీనివాసరావు. # దేశ నిర్మాణంలో యువత భాగస్వామ్యం అత్యంత కీలకం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. # ప్రతి మెడికల్ బోర్డు దరఖాస్తుదారుడికి ఇన్వాలిడేషన్ కల్పించాలి-ఎఐటియుసి నేత మిరియాల రంగయ్య డిమాండ్. # విద్యార్థి పోరాటాలకు తలవంచక తప్పదు. ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వర్క అజిత్. # విద్యార్థుల ఐక్య పోరాట ఫలితమే ధర్మేంద్ర ప్రధాన రాజీనామా. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా # భద్రాచలంలో 101 కిలోల డ్రై గంజాయి స్వాధీనం. # వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త ఉన్నత విద్యాసంస్థల బంద్ విజయవంతం.

ముక్కోటి ఏకాదశి ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్.

Date : 28 November 2025 05:45 PM Views : 149

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో డిసెంబర్ 29న నిర్వహించు తెప్పోత్సవం, 30న నిర్వహించనున్న ముక్కోటి ఏకాదశి సందర్భంగా భారీగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో, సంబంధిత ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ శుక్రవారం ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఉత్తర ద్వారం, కళ్యాణ మండపం, అధ్యయన వేదిక, క్యూ లైన్‌లు, భక్తుల కోసం సెక్టార్‌ వైజ్ ఏర్పాట్లు వంటి అంశాలపై దేవస్థానం అధికారులతో సమగ్ర సమీక్ష నిర్వహించారు.మిథిలా స్టేడియం ఉత్తర ద్వారం ప్రాంతంలో క్యూ లైన్‌ల ఏర్పాటు, భక్తుల ప్రవేశ–నిష్క్రమణ మార్గాలు, భద్రతా బలగాల మోహరింపు, త్రాగునీరు, వైద్య సేవలు, శానిటేషన్, మొబైల్ టాయిలెట్స్ వంటి మౌలిక సదుపాయాలను కలెక్టర్ వ్యక్తిగతంగా పరిశీలించి అవసరమైన మార్గదర్శకాలు ఇచ్చారు. భక్తులకు ఎటువంటి అంతరాయం కలగకుండా ప్రతి విభాగం సమన్వయంతో పనిచేయాలని ఆయన ఆదేశించారు.కలెక్టర్ మాట్లాడుతూ, ముక్కోటి ఏకాదశి సందర్భంగా లక్షలాది మంది భక్తులు భద్రాచలానికి చేరుకునే అవకాశం ఉన్నందున ఏర్పాట్లు పూర్తిస్థాయిలో, నిర్లక్ష్యం లేకుండా చేయాలని సూచించారు. అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రత్యేక రెస్క్యూ టీమ్‌లను సిద్ధంగా ఉంచాలని, వైద్య విభాగం 24 గంటలు అంబులెన్స్‌లు, వైద్య సిబ్బంది అందుబాటులో ఉండేలా చూడాలని ఆదేశించారు.ఉత్తర ద్వారం వద్ద బారికేడింగ్, క్యూ లైన్ క‌వ‌ర్లు, లైటింగ్‌, సీసీ కెమెరాలు, సమాచార ప్యానెల్స్ ఏర్పాటు వంటి పనుల పురోగతిని ఇంజినీరింగ్ విభాగం అధికారులు కలెక్టర్‌కు వివరించారు. భద్రతా పరంగా పోలీసు విభాగం, దేవస్థానం విజిలెన్స్, శానిటరీ సిబ్బంది అన్ని విభాగాలు పరస్పర సహకారంతో పని చేయాలని ఆయన సూచించారు.భక్తులకు సులభ దర్శనం అందించడం ప్రధానం కావడంతో రెస్టింగ్ పాయింట్లు, మెడికల్ క్యాంపులు వంటి ఏర్పాట్లలో ఎలాంటి నిర్లక్ష్యం జరగకూడదని కలెక్టర్ హెచ్చరించారు. భక్తుల రద్దీ అధికంగా ఉండే సమయాల్లో అదనపు వాలంటీర్లు, సిబ్బంది మోహరించాలని సూచించారు.దేవస్థానం పరిసరాల్లో స్వచ్ఛత, ట్రాఫిక్ నిర్వహణ, పార్కింగ్ ఏర్పాట్లు కూడా కీలకమని పేర్కొంటూ, పంచాయతీ శాఖతో దేవస్థానం అధికారులు సమన్వయం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. ప్రతి విభాగం రోజువారీ పురోగతి నివేదికను సమర్పించి, నిర్ణీత గడువులో అన్ని పనులు పూర్తిచేయాలని ఆయన ఆదేశించారు.ఎటువంటి విభాగం నిర్లక్ష్యం చూపకూడదని హెచ్చరిస్తూ, భక్తుల సౌకర్యం దృష్టిలో ఉంచుకుని మొత్తం ఏర్పాట్లను అత్యుత్తమంగా పూర్తి చేయాలని కలెక్టర్ జితేష్ వి. పాటిల్ స్పష్టం చేశారు.ఈ పరిశీలన కార్యక్రమంలో దేవస్థానం ఈవో కె. దామోదర్ రావు, ఇంజినీరింగ్ విభాగం ఈఈ వి. రవీంద్రనాథ్, ఏఈఓలు శ్రవణ్ కుమార్, భవానీ, రామకృష్ణారావు తదితర అధికారులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :