Tuesday, 28 July 2026 11:04:50 AM
# విద్యార్థుల ఉసురుతీసిన నీట్ కుంభకోణం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని. # రూ.2 కోట్లతో పూర్తయిన సెంట్రల్ లైటింగ్, టూవే లైన్ రోడ్డులో ప్రారంభించిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # అనంతారం గ్రామంలో రైతు సదస్సు, నీటి సంరక్షణ పై అధికారుల అవగాహన. # బొగ్గు ఉత్పత్తి సాధనలో కార్మికుల సమిష్టి కృషి అభినందనీయం. కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ (జీఎం) షాలెం రాజు. # 16వ డివిజన్లో ప్రారంభమైన తొలిముద్ద - బాల భరోసా చిన్నారులకు తొలిముద్ద ను వడ్డిస్తున్న డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # రేగళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆకస్మిక తనిఖీ. ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # మాదకద్రవ్యాల నియంత్రణపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలి: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ . # కొత్తగూడెం ఏరియా జీఎం షాలెంరాజుకు ఘన వీడ్కోలు. పదవీవిరమణ శుభాకాంక్షలు తెలిపిన ఆర్‌సీహెచ్‌పీ అధికారులు, ఉద్యోగులు, కార్మికులు. # జెన్ జీ నీ తెలంగాణ విద్యాశాఖ మంత్రినీ చేయాలి..జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # సుజాతనగర్ మండల సమగ్ర అభివృద్ధికి నిరంతర కృషి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # శ్రీరాముడు కొలువైన జిల్లాలో పనిచేయటం అదృష్టం -సీనియర్ జర్నలిస్ట్ ఎస్ వి సూర్యనారాయణ. # ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # విత్తన మేళాను రైతులు సద్వినియోగం చేసుకోవాలి : వ్యవసాయ శాఖ అధికారి బాబురావు. # ఉమ్మడి ఖమ్మం జిల్లా సమస్యలపై జనసేన పోరాటం. గడల శ్రీనివాసరావు. # దేశ నిర్మాణంలో యువత భాగస్వామ్యం అత్యంత కీలకం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. # ప్రతి మెడికల్ బోర్డు దరఖాస్తుదారుడికి ఇన్వాలిడేషన్ కల్పించాలి-ఎఐటియుసి నేత మిరియాల రంగయ్య డిమాండ్. # విద్యార్థి పోరాటాలకు తలవంచక తప్పదు. ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వర్క అజిత్. # విద్యార్థుల ఐక్య పోరాట ఫలితమే ధర్మేంద్ర ప్రధాన రాజీనామా. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా # భద్రాచలంలో 101 కిలోల డ్రై గంజాయి స్వాధీనం. # వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త ఉన్నత విద్యాసంస్థల బంద్ విజయవంతం.

రామవరం అంబేద్కర్ భవన్లో ఘనంగా మహాత్మా జ్యోతిరావు పూలే 198 వ జయంతి వేడుకలు

Date : 11 April 2025 07:48 PM Views : 402

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రమైన సింగరేణి కార్మిక ప్రాంతం రామవరం పట్టణంలోని అంబేద్కర్ భవన్ ( మాదిగ సంక్షేమ సంఘం ) ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతిరావు పూలే 198 వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ యొక్క కార్యక్రమానికి మాదిగ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు కొయ్యడ వెంకన్న అధ్యక్షత వహించగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జాతీయ ఫెలోషిప్ అవార్డు గ్రహీత బరిగెల భూపేష్ మాట్లాడుతూ పూలే మహారాష్ట్రలోని పూణే ప్రాంతంలో ఏప్రిల్ 11, 1827న జన్మించడం జరిగిందని, తన తండ్రి గారైన గోవిందరావు పూలే పూల వ్యాపారం చేసుకుంటూ జీవనం కొనసాగించేవాడు. ఆ రోజుల్లో దళిత బహుజన ల మీద అనేక దాడులతో పాటు విద్యకు దూరంగా ఉంచుతూ అంటరాని వారిగా చూసేవారు. సావిత్రిబాయి పూలేను వివాహం చేసుకున్న పూలే ఆమెకు స్వయంగా విద్యను నేర్పుతూ 1848 లో దళిత బాలికల పాఠశాలను ఏర్పాటు చేశారు. ఆ పాఠశాలకు ఉపాధ్యాయురాలిగా భార్య సావిత్రిబాయి పూలే భారత దేశంలోనే మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలిగా వ్యవహరించారు 1873, సెప్టెంబర్ 24న సత్యశోధక్ సమాజ్ ఏర్పాటు చేసి విద్యను అందించడమే కాక మహిళలకు అనేక హక్కులు సాధించారు , ఆ తథనంతరం నవంబర్ 28, 1890లో మృతి చెందారు. మహాత్మ జ్యోతిరావు పూలే కు భారతరత్న ఇవ్వాలన్నారు ఎందుకంటే 1954లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ బిబిసి టీవీ ఛానల్ లో ఇచ్చిన ఇంటర్వ్యూలో నా గురువులు ముగ్గురు గౌతమ బుద్ధుడు, జ్యోతిరావు పూలే, కబీర్ దాస్ అని చెప్పడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో మాదిగ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు కొయ్యడ వెంకన్న, జిల్లా కార్యదర్శి సామర్ల సమ్మయ్య జిల్లా నాయకులు మాతంగి లింగయ్య, కొత్తూరు మదనయ్య, సావటి స్వామి,కూరగాయల శ్రీను, ఇండిగపల్లి శంకర్, కాంపెళ్లి దుర్గయ్య, తిప్పారపు ఎల్లయ్య, నాగేల్లి మొగిలి, శనిగారపు కుమారస్వామి, కొత్తూరి రవి,మాటేటి అంజయ్య,మద్దికుంట గణేష్, నమిల్ల మధు,అన్నవరం, ఎస్.కె నాగుల్ మీరా, వెంకట్రావు, తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :