తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : వినాయక చవితి సందర్భంగా సింగరేణి కార్మికులు, అధికారులు మట్టి వినాయక ప్రతిమలతో పూజా కార్యక్రమాలు నిర్వహించాలని, తద్వారా తమ వంతుగా పర్యావరణకు దోహదపడాలని సింగరేణి డైరెక్టర్ పర్సనల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ వెల్ఫేర్ గౌతమ్ పొట్రు పిలుపునిచ్చారు. హైదరాబాద్ సింగరేణి భవన్ లో సోమవారం ఆయన మట్టి వినాయక ప్రతిమలను ఉద్యోగులకు, అధికారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యావరణహిత మైనింగ్ కు మారుపేరుగా నిలుస్తున్న సింగరేణి సంస్థ, పర్యావరణహితంగా వినాయక చవితి పండుగను తమ ఉద్యోగులు నిర్వహించుకోవాలన్న ఉద్దేశంతో గత కొన్ని సంవత్సరాలుగా మట్టి వినాయక ప్రతిమలను అందజేస్తుందని, కనుక ఉద్యోగులు వారి కుటుంబ సభ్యులు ఈ మట్టి ప్రతిమలతో వినాయక చవితిని ఘనంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో తయారుచేసిన వినాయక ప్రతిమలు నిమజ్జనం అనంతరం చెరువుల్లో, జలాశయాలలో జల కాలుష్యానికి కారణం అవుతున్నాయని, దీనిని నివారించాలంటే మట్టి విగ్రహాలతో వినాయకుని పూజా కార్యక్రమాలు జరుపుకోవడం ఎంతో శ్రేయస్కరమని, తద్వారా మన పూర్వీకుల సాంప్రదాయాన్ని తిరిగి కొనసాగించిన వారమవుతామని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జీఎం మార్కెటింగ్ టి.శ్రీనివాస్, సింగరేణి భవన్ ఉద్యోగులు పాల్గొన్నరు
Admin
తెలుగు వెలుగు టీవీ