Tuesday, 28 July 2026 12:39:43 PM
# విద్యార్థుల ఉసురుతీసిన నీట్ కుంభకోణం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని. # రూ.2 కోట్లతో పూర్తయిన సెంట్రల్ లైటింగ్, టూవే లైన్ రోడ్డులో ప్రారంభించిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # అనంతారం గ్రామంలో రైతు సదస్సు, నీటి సంరక్షణ పై అధికారుల అవగాహన. # బొగ్గు ఉత్పత్తి సాధనలో కార్మికుల సమిష్టి కృషి అభినందనీయం. కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ (జీఎం) షాలెం రాజు. # 16వ డివిజన్లో ప్రారంభమైన తొలిముద్ద - బాల భరోసా చిన్నారులకు తొలిముద్ద ను వడ్డిస్తున్న డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # రేగళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆకస్మిక తనిఖీ. ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # మాదకద్రవ్యాల నియంత్రణపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలి: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ . # కొత్తగూడెం ఏరియా జీఎం షాలెంరాజుకు ఘన వీడ్కోలు. పదవీవిరమణ శుభాకాంక్షలు తెలిపిన ఆర్‌సీహెచ్‌పీ అధికారులు, ఉద్యోగులు, కార్మికులు. # జెన్ జీ నీ తెలంగాణ విద్యాశాఖ మంత్రినీ చేయాలి..జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # సుజాతనగర్ మండల సమగ్ర అభివృద్ధికి నిరంతర కృషి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # శ్రీరాముడు కొలువైన జిల్లాలో పనిచేయటం అదృష్టం -సీనియర్ జర్నలిస్ట్ ఎస్ వి సూర్యనారాయణ. # ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # విత్తన మేళాను రైతులు సద్వినియోగం చేసుకోవాలి : వ్యవసాయ శాఖ అధికారి బాబురావు. # ఉమ్మడి ఖమ్మం జిల్లా సమస్యలపై జనసేన పోరాటం. గడల శ్రీనివాసరావు. # దేశ నిర్మాణంలో యువత భాగస్వామ్యం అత్యంత కీలకం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. # ప్రతి మెడికల్ బోర్డు దరఖాస్తుదారుడికి ఇన్వాలిడేషన్ కల్పించాలి-ఎఐటియుసి నేత మిరియాల రంగయ్య డిమాండ్. # విద్యార్థి పోరాటాలకు తలవంచక తప్పదు. ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వర్క అజిత్. # విద్యార్థుల ఐక్య పోరాట ఫలితమే ధర్మేంద్ర ప్రధాన రాజీనామా. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా # భద్రాచలంలో 101 కిలోల డ్రై గంజాయి స్వాధీనం. # వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త ఉన్నత విద్యాసంస్థల బంద్ విజయవంతం.

నిరుద్యోగ సమస్య రూపుమాపలేని ప్రభుత్వాలకు పాలించే హక్కు లేదు

Date : 08 June 2026 06:52 PM Views : 101

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఖాళీ పోస్టుల భర్తీ, కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ నమన్య వరిష్కారానికి ఉద్యమిస్తాం - ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి ఫహీమ్ నిరుద్యోగ సమస్యను రూపుమాపడం చేతగాని ప్రభుత్వాలకు పాలించే హక్కు లేదని, మోసపూరి.త వాగ్దానాల చేసి యువతరం ఓట్లతో గద్దెనెక్కిన తర్వాత పాలకులు నిరుద్యోగాన్ని పెంచి పోషిస్తున్నారని అఖిలభారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్) జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్కే ఫహీమ్ దాదా అన్నారు. ఈ మేరకు సోమవారం ప్రజావాణిలో కలెక్టర్ అంకితక్కు వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎన్నో ఆశలతో ప్రభుత్వాలకు అధికారాన్ని కట్టబెట్టిన యువత బ్రతుకులు నట్టేట పాలవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ శాఖల్లో వేలాది పోస్టులు ఖాళీగా ఉన్నాయని, వాటిని భర్తీ చేయకుండా ఉన్నవారికే అడనవు బాధ్యతలు అప్పగిస్తూ నెట్టుకొస్తున్నారని చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి బదులుగా కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ విధానాలను తీసుకొచ్చి ఉద్యోగ భద్రతను దూరం చేశారని మండిపడ్డారు. ఇలాంటి విధానాలు నిరుద్యోగులకు అన్యాయం చేసే విధంగా ఉన్నాయని, ప్రజా సేవల నాణ్యతను కూడా దెబ్బతీస్తున్నాయని ఫహీమ్ చెప్పారు. ప్రభుత్వ విద్యారంగం తీవ్ర సంక్షోబాన్ని ఎదుర్కొంటోందని, ఉపాధ్యాయు పోస్టులు ఖాళీగా ఉండటం, మౌళిక వసతుల కొరత, నిధుల లేని కారణంగా ప్రభుత్వ విద్య నానాటికీ బలహీన పడుతోందన్నారు. ఇదే సమయంలో కార్పొరేట్ విద్యాసంస్థలు అధిక ఫీజులతో దోపిడీ చేస్తున్నాయని, ఫీజుల నియంత్రణా చట్టాన్ని వకడ్బందీగా అమలు చేయడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయని చెప్పారు. రాష్ట్రంలో అన్నిశాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులపై శ్వేత పత్రం విడుదల చేయాలని, పోస్టులను వెంటనే భర్తీ చేయాలని, కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ విధానాన్ని రద్దు చేసి శాశ్వత నియామకాలు చేపట్టాలని టిజి పిఎస్సి ద్వారా వార్షిక నియామక క్యాలెండర్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. లేదంటే ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో యువతను సమీకరించి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. వినతి పత్రం అందించిన వారిలో ఏఐవైఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి ఎన్కే ఖయ్యూమ్, జిల్లా కౌన్సిల్ సభ్యులు రసూల్, రౌతు నురేష్, దాసరి శివ, రణధీర్ తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :