తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ప్రాథమిక విద్యలో పూర్వ ప్రాథమిక విద్య ప్రవేశపెట్టడం అత్యంత ఆవశ్యకమని దీనికోసం రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన ప్రణాళికలు రచిస్తున్నదని విశ్రాంత ఐఏఎస్ అధికారి ఐ వి సుబ్బారావు అన్నారు. ఈరోజు ఉదయం బూర్గంపాడు మండలంలోని నాగినేని ప్రోలు ప్రాథమిక పాఠశాలలో ఉన్న అంగన్వాడీ పూర్వ ప్రాథమిక విద్యా కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తో కలిసి పరిశీలించి అక్కడి పిల్లలతో మాట్లాడారు. అనంతరం అంగన్వాడి కార్యకలాపాల గురించి అక్కడే అంగన్వాడీ టీచర్ మరియు స్థానిక సూపర్వైజర్ తో మాట్లాడి తెలుసుకున్నారు. పిల్లలకు అందించే వివిధ రకాలైన పోషక పదార్థాలు అదేవిధంగా తల్లులకు అందించే పోషక ఆహారం గురించి తెలుసుకున్నారు. పాఠశాల ఆకర్షణీయంగా తీర్చిదిద్దటం పట్ల అక్కడి అంగన్వాడి కేంద్ర సిబ్బందిని ప్రశంసించారు. అనంతరం అదే పాఠశాలలోని కృత్రిమ మేధ ద్వారా ఎఫ్ ఎల్ ఎన్ అభివృద్ధి కార్యక్రమాన్ని పరిశీలించి ఈ కార్యక్రమం పిల్లలు అభ్యసన మెరుగుపరచుకోవటానికి గొప్ప అవకాశం అని దీనిని సమర్థవంతంగా వినియోగించి అన్ని పాఠశాలల్లో అమలయ్యేటట్లుగా చూడాలని జిల్లా కలెక్టర్ ను కోరారు. ఈ కార్యక్రమంలో భద్రాచలం సబ్ కలెక్టర్ మృనాల్ శ్రేష్ట ఐఏఎస్ అసిస్టెంట్ కలెక్టర్ సౌరబ్ శర్మ, అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీ విద్యాచందన, జిల్లా విద్యాశాఖ అధికారి నాగలక్ష్మి, జిల్లా విద్యాశాఖ కోఆర్డినేటర్లు నాగ రాజశేఖర్, సతీష్ కుమార్, సైదులు, మండల అధికారులు పాల్గొన్నారు. అనంతరం కొత్తగూడెంలోని సింగరేణి గెస్ట్ హౌస్ లో జిల్లా కలెక్టర్ తో కలిసి జిల్లా విద్యాశాఖ అధికారి, మండల విద్యాశాఖ అధికారులు, జిల్లా అభివృద్ధి అధికారి, సిడిపిఓలు, ఇండస్ట్రియల్ అధికారులతో, సమావేశం నిర్వహించిన ఆయన పూర్వ ప్రాథమిక విద్యను ప్రాథమిక పాఠశాలలో విలీనం చేయటం పట్ల అందరీ అభిప్రాయాలను తెలుసుకున్నారు. అంతేగాక విద్యావ్యవస్థ పటిష్టవంతంగా నడవడానికి కావలసిన సూచనలు సలహాలను కూడా చర్చించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి బి నాగలక్ష్మి, జిల్లా విద్యాశాఖ కోఆర్డినేటర్ నాగరాజు శేఖర్, వివిధ మండలాల మండల విద్యాశాఖ అధికారులు, జిల్లా సంక్షేమ అధికారి స్వర్ణలత లేనినా, సిడిపిఓలు, జిల్లా పారిశ్రామిక అభివృద్ధి అధికారి పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ