Tuesday, 28 July 2026 04:54:30 PM
# విద్యార్థుల ఉసురుతీసిన నీట్ కుంభకోణం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని. # రూ.2 కోట్లతో పూర్తయిన సెంట్రల్ లైటింగ్, టూవే లైన్ రోడ్డులో ప్రారంభించిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # అనంతారం గ్రామంలో రైతు సదస్సు, నీటి సంరక్షణ పై అధికారుల అవగాహన. # బొగ్గు ఉత్పత్తి సాధనలో కార్మికుల సమిష్టి కృషి అభినందనీయం. కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ (జీఎం) షాలెం రాజు. # 16వ డివిజన్లో ప్రారంభమైన తొలిముద్ద - బాల భరోసా చిన్నారులకు తొలిముద్ద ను వడ్డిస్తున్న డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # రేగళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆకస్మిక తనిఖీ. ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # మాదకద్రవ్యాల నియంత్రణపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలి: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ . # కొత్తగూడెం ఏరియా జీఎం షాలెంరాజుకు ఘన వీడ్కోలు. పదవీవిరమణ శుభాకాంక్షలు తెలిపిన ఆర్‌సీహెచ్‌పీ అధికారులు, ఉద్యోగులు, కార్మికులు. # జెన్ జీ నీ తెలంగాణ విద్యాశాఖ మంత్రినీ చేయాలి..జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # సుజాతనగర్ మండల సమగ్ర అభివృద్ధికి నిరంతర కృషి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # శ్రీరాముడు కొలువైన జిల్లాలో పనిచేయటం అదృష్టం -సీనియర్ జర్నలిస్ట్ ఎస్ వి సూర్యనారాయణ. # ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # విత్తన మేళాను రైతులు సద్వినియోగం చేసుకోవాలి : వ్యవసాయ శాఖ అధికారి బాబురావు. # ఉమ్మడి ఖమ్మం జిల్లా సమస్యలపై జనసేన పోరాటం. గడల శ్రీనివాసరావు. # దేశ నిర్మాణంలో యువత భాగస్వామ్యం అత్యంత కీలకం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. # ప్రతి మెడికల్ బోర్డు దరఖాస్తుదారుడికి ఇన్వాలిడేషన్ కల్పించాలి-ఎఐటియుసి నేత మిరియాల రంగయ్య డిమాండ్. # విద్యార్థి పోరాటాలకు తలవంచక తప్పదు. ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వర్క అజిత్. # విద్యార్థుల ఐక్య పోరాట ఫలితమే ధర్మేంద్ర ప్రధాన రాజీనామా. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా # భద్రాచలంలో 101 కిలోల డ్రై గంజాయి స్వాధీనం. # వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త ఉన్నత విద్యాసంస్థల బంద్ విజయవంతం.

కేంద్ర ప్రభుత్వం తెలంగాణ(Telangana)కు కొత్తగా 7 జవహర్ నవోదయ విద్యాలయాల(JNV)ను మంజూరు చేసింది

Date : 16 June 2025 09:33 PM Views : 2964

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : తెలంగాణ(Telangana)కు కొత్తగా 7 జవహర్ నవోదయ విద్యాలయాల(JNV)ను మంజూరు చేసింది. అయితే ఈ కొత్త విద్యాలయాల ఏర్పాటుకు 2024 డిసెంబర్లో ఆమోదం తెలిపినప్పటికీ, నేడు అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది కేంద్ర ప్రభుత్వం. కొత్తగా మంజూరైన జవహర్ నవోదయ విద్యాలయాలు భద్రాద్రి కొత్తగూడెం, జగిత్యాల, మహబూబ్నగర్, మేడ్చల్-మల్కాజ్గరి, నిజామాబాద్, సంగారెడ్డి, సూర్యాపేట జిల్లాల్లో స్థాపించబడతాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో దేశవ్యాప్తంగా 28 నవోదయ విద్యాలయాలు, 85 కేంద్రీయ విద్యాలయాల ఏర్పాటుకు ఆమోదం లభించింది. ప్రస్తుతం తెలంగాణలో 9 నవోదయ విద్యాలయాలు (కరీంనగర్, కుమురంభీం ఆసిఫాబాద్, నాగర్కర్నూల్, నల్గొండ, కామారెడ్డి, వరంగల్, రంగారెడ్డి, సిద్దిపేట, ఖమ్మం) ఉండగా, కొత్తగా మంజూరైన 7తో కలిపి మొత్తం 16కు చేరనున్నాయి. ఈ కొత్త విద్యాలయాల ఏర్పాటుకు 2024-29 మధ్యకాలంలో రూ.2,359 కోట్లు ఖర్చు అవుతుందని, ఇందులో మూలధన వ్యయం రూ.1,944 కోట్లు, నిర్వహణ ఖర్చు రూ.415 కోట్లుగా అంచనా వేయబడింది.

ప్రస్తుతం తెలంగాణలో 9 నవోదయ విద్యాలయాలు (కరీంనగర్, కుమురంభీం ఆసిఫాబాద్, నాగర్కర్నూల్, నల్గొండ, కామారెడ్డి, వరంగల్, రంగారెడ్డి, సిద్దిపేట, ఖమ్మం) ఉండగా, కొత్తగా మంజూరైన 7తో కలిపి మొత్తం 16కు చేరనున్నాయి. ఈ కొత్త విద్యాలయాల ఏర్పాటుకు 2024-29 మధ్యకాలంలో రూ.2,359 కోట్లు ఖర్చు అవుతుందని, ఇందులో మూలధన వ్యయం రూ.1,944 కోట్లు, నిర్వహణ ఖర్చు రూ.415 కోట్లుగా అంచనా వేయబడింది. తెలంగాణ విద్యాశాఖ అధికారులు నవోదయ విద్యాలయ అధికారులతో సమావేశమై, ఈ 7 విద్యాలయాల్లో జూలై 14, 2025 నుంచి తరగతులు ప్రారంభించేందుకు ప్రణాళికలు రూపొందించారు. ఈ విద్యాలయాలు పూర్తిస్థాయి రెసిడెన్షియల్ పాఠశాలలుగా ఉంటాయి, బాలబాలికలకు ఉచిత విద్య, హాస్టల్ వసతి, దేశభక్తి, క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు, ఎన్సీసీ, చిత్రలేఖనం వంటి శిక్షణను అందిస్తాయి. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు 75% సీట్లు కేటాయించబడతాయి, ప్రవేశాలు జవహర్ నవోదయ విద్యాలయ ఎంపిక పరీక్ష (JNVST) ద్వారా జరుగుతాయి.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :