తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : అనంతారం గ్రామ సర్పంచ్ కాంగ్రెస్ అభ్యర్థిగా కోర్సా రమేష్ నామినేషన్ వేయడం జరిగింది. కోర్సా రమేష్ మాట్లాడుతూ అవకాశం ఇవ్వండి అభివృద్ధి చేసి చూపిస్తా అంటూ.. గ్రామాభివృద్ధి ఉద్దేశంతో ప్రజలు ఆశీర్వదించి సర్పంచ్ గా గెలిపిస్తే అన్ని రంగాల్లో ముందుండి మీ సమస్యలే నా సమస్యలుగా భావించి నిరంతరం ప్రజాసేవ కొరకు కృషి చేస్తానని, అన్ని రంగాల వర్గాల వారికి అనుకూలంగా సేవలందిస్తానని కుల మత జాతి విభేదాలు లేకుండా అందరిని సమాన దృక్పథంతో ప్రతి ఒక్కరిని సోదర భావంతో చూస్తాను.ఆత్మగౌరవంతో సమాజ సేవకు ముందుకు వచ్చాను మీరందరూ పెద్ద మనసు చేసుకొని సర్పంచ్ గా గెలిపిస్తే అనేక అభివృద్ధి పనులు చేయిస్తాను, రాజకీయంగా, ఆర్థికంగా,సమాజ సేవకు ముందుండి సేవ చేయడానికి ఒక్క అవకాశం ఇవ్వాలని గ్రామ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. స్వార్థ రాజకీయాలకు తావు లేకుండా నిస్వార్ధమైన సేవలను అందించడంలో ముందు ఉంటానని, ఒక్క అవకాశం ఇస్తే అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపిస్తానని గ్రామస్తులను కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో మండలంలో ఒక ఊరు పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి నిరుపేదలందరికీ ఇల్లు అందజేయాలనే ఉద్దేశంలో ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయానికి మండలంలో 24 పంచాయతీల రాజకీయ నాయకులు పోటీపడ్డారు. ఆ తరుణంలో గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఉసికల వెంకటేశ్వర్లు సహాయంతో పైలెట్ గ్రామ పంచాయతీగా తీసుకురావడానికి తీవ్రంగా కృషి చేశాం దాని ఫలితమే అనంతారం గ్రామపంచాయతీ పైలెట్ ప్రాజెక్టుగా ఎంపికైనది. దాని ఫలితంగా గ్రామంలో 85 మంది నిరుపేదలకు ఇల్లు వచ్చాయి గతంలో ఎన్నడూ లేని విధంగా 50 మంది కుటుంబీకులకు తెల్ల రేషన్ కార్డులు తీసుకువచ్చామ్, ఆరోగ్యం బాగోలేక హాస్పిటల్స్ లో ఖర్చుపెట్టిన డబ్బులను సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా 20 కుటుంబాలకు చెక్కుల అందేలా చేసాం కనుక మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలంటూ గడపగడపకు తిరుగుతూ ప్రచారాన్ని కొనసాగిస్తున్నాడు
Admin
తెలుగు వెలుగు టీవీ