Tuesday, 28 July 2026 02:27:01 PM
# విద్యార్థుల ఉసురుతీసిన నీట్ కుంభకోణం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని. # రూ.2 కోట్లతో పూర్తయిన సెంట్రల్ లైటింగ్, టూవే లైన్ రోడ్డులో ప్రారంభించిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # అనంతారం గ్రామంలో రైతు సదస్సు, నీటి సంరక్షణ పై అధికారుల అవగాహన. # బొగ్గు ఉత్పత్తి సాధనలో కార్మికుల సమిష్టి కృషి అభినందనీయం. కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ (జీఎం) షాలెం రాజు. # 16వ డివిజన్లో ప్రారంభమైన తొలిముద్ద - బాల భరోసా చిన్నారులకు తొలిముద్ద ను వడ్డిస్తున్న డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # రేగళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆకస్మిక తనిఖీ. ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # మాదకద్రవ్యాల నియంత్రణపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలి: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ . # కొత్తగూడెం ఏరియా జీఎం షాలెంరాజుకు ఘన వీడ్కోలు. పదవీవిరమణ శుభాకాంక్షలు తెలిపిన ఆర్‌సీహెచ్‌పీ అధికారులు, ఉద్యోగులు, కార్మికులు. # జెన్ జీ నీ తెలంగాణ విద్యాశాఖ మంత్రినీ చేయాలి..జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # సుజాతనగర్ మండల సమగ్ర అభివృద్ధికి నిరంతర కృషి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # శ్రీరాముడు కొలువైన జిల్లాలో పనిచేయటం అదృష్టం -సీనియర్ జర్నలిస్ట్ ఎస్ వి సూర్యనారాయణ. # ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # విత్తన మేళాను రైతులు సద్వినియోగం చేసుకోవాలి : వ్యవసాయ శాఖ అధికారి బాబురావు. # ఉమ్మడి ఖమ్మం జిల్లా సమస్యలపై జనసేన పోరాటం. గడల శ్రీనివాసరావు. # దేశ నిర్మాణంలో యువత భాగస్వామ్యం అత్యంత కీలకం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. # ప్రతి మెడికల్ బోర్డు దరఖాస్తుదారుడికి ఇన్వాలిడేషన్ కల్పించాలి-ఎఐటియుసి నేత మిరియాల రంగయ్య డిమాండ్. # విద్యార్థి పోరాటాలకు తలవంచక తప్పదు. ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వర్క అజిత్. # విద్యార్థుల ఐక్య పోరాట ఫలితమే ధర్మేంద్ర ప్రధాన రాజీనామా. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా # భద్రాచలంలో 101 కిలోల డ్రై గంజాయి స్వాధీనం. # వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త ఉన్నత విద్యాసంస్థల బంద్ విజయవంతం.

వ్యవసాయ కమిటీ మార్కెట్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ అంకిత్

Date : 21 May 2026 03:09 PM Views : 123

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : లక్ష్మీదేవిపల్లి మండలం కొత్తగూడెం వ్యవసాయ కమిటీ మార్కెట్‌ను జిల్లా కలెక్టర్ అంకిత్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. మార్కెట్ యార్డులో కొనసాగుతున్న మొక్కజొన్న కొనుగోలు, నిల్వలు, అన్‌లోడింగ్ ప్రక్రియలను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. వివిధ మండలాల నుంచి రైతులు మొక్కజొన్నతో మార్కెట్ యార్డుకు తీసుకొచ్చిన ట్రాక్టర్లు, లారీల వివరాలను అడిగి తెలుసుకున్నారు. కొనుగోలు ప్రక్రియలో ఎలాంటి జాప్యం లేకుండా వేగవంతంగా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా వ్యవసాయ కమిటీ గోడౌన్లలో అందుబాటులో ఉన్న నిల్వ సామర్థ్యం, గోడౌన్ల వినియోగం, రవాణా ఏర్పాట్లు, హమాలీల అందుబాటు తదితర అంశాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం వ్యవసాయ కమిటీ మార్కెట్‌లో సుమారు 2500 మెట్రిక్ టన్నుల గోడౌన్ సామర్థ్యం అందుబాటులో ఉందని అధికారులు కలెక్టర్‌కు వివరించారు. సుజాతనగర్, లక్ష్మీదేవిపల్లి, గుండాల మండలాలకు చెందిన మొక్కజొన్నను ఈ మార్కెట్‌కు మ్యాపింగ్ చేసినట్లు తెలిపారు. మార్కెట్ యార్డులో మొక్కజొన్న బస్తాల అన్‌లోడింగ్ ప్రక్రియను పరిశీలించిన జిల్లా కలెక్టర్, వివిధ మండలాల నుంచి వచ్చిన ట్రాక్టర్లు, లారీల అన్‌లోడింగ్ ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. రైతులు ఎక్కువసేపు నిరీక్షించాల్సిన పరిస్థితి లేకుండా అవసరమైన హమాలీలు, యంత్ర సామగ్రి అందుబాటులో ఉంచాలని సూచించారు. ప్రస్తుతం సుమారు 110 మంది హమాలీలు విధుల్లో ఉన్నట్లు అధికారులు కలెక్టర్‌కు తెలిపారు. అవసరమైతే అదనపు హమాలీలను ఏర్పాటు చేసి కొనుగోలు ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని కలెక్టర్ ఆదేశించారు. మొక్కజొన్న బస్తాల తూకం, నిల్వ, రవాణా ప్రక్రియలను సమన్వయంతో నిర్వహించాలని, గోడౌన్లలో నిల్వలను శాస్త్రీయ పద్ధతుల్లో భద్రపరచాలని అధికారులకు సూచించారు. మార్కెట్ యార్డులో రైతులకు తాగునీరు, నీడ, ఇతర మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కొనుగోలు ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ఈ తనిఖీలో తాసిల్దార్ శిరీష, వ్యవసాయ,మార్కెట్ శాఖ అధికారులు, సంబంధిత సిబ్బంది పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :