Tuesday, 28 July 2026 02:37:24 PM
# విద్యార్థుల ఉసురుతీసిన నీట్ కుంభకోణం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని. # రూ.2 కోట్లతో పూర్తయిన సెంట్రల్ లైటింగ్, టూవే లైన్ రోడ్డులో ప్రారంభించిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # అనంతారం గ్రామంలో రైతు సదస్సు, నీటి సంరక్షణ పై అధికారుల అవగాహన. # బొగ్గు ఉత్పత్తి సాధనలో కార్మికుల సమిష్టి కృషి అభినందనీయం. కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ (జీఎం) షాలెం రాజు. # 16వ డివిజన్లో ప్రారంభమైన తొలిముద్ద - బాల భరోసా చిన్నారులకు తొలిముద్ద ను వడ్డిస్తున్న డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # రేగళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆకస్మిక తనిఖీ. ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # మాదకద్రవ్యాల నియంత్రణపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలి: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ . # కొత్తగూడెం ఏరియా జీఎం షాలెంరాజుకు ఘన వీడ్కోలు. పదవీవిరమణ శుభాకాంక్షలు తెలిపిన ఆర్‌సీహెచ్‌పీ అధికారులు, ఉద్యోగులు, కార్మికులు. # జెన్ జీ నీ తెలంగాణ విద్యాశాఖ మంత్రినీ చేయాలి..జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # సుజాతనగర్ మండల సమగ్ర అభివృద్ధికి నిరంతర కృషి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # శ్రీరాముడు కొలువైన జిల్లాలో పనిచేయటం అదృష్టం -సీనియర్ జర్నలిస్ట్ ఎస్ వి సూర్యనారాయణ. # ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # విత్తన మేళాను రైతులు సద్వినియోగం చేసుకోవాలి : వ్యవసాయ శాఖ అధికారి బాబురావు. # ఉమ్మడి ఖమ్మం జిల్లా సమస్యలపై జనసేన పోరాటం. గడల శ్రీనివాసరావు. # దేశ నిర్మాణంలో యువత భాగస్వామ్యం అత్యంత కీలకం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. # ప్రతి మెడికల్ బోర్డు దరఖాస్తుదారుడికి ఇన్వాలిడేషన్ కల్పించాలి-ఎఐటియుసి నేత మిరియాల రంగయ్య డిమాండ్. # విద్యార్థి పోరాటాలకు తలవంచక తప్పదు. ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వర్క అజిత్. # విద్యార్థుల ఐక్య పోరాట ఫలితమే ధర్మేంద్ర ప్రధాన రాజీనామా. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా # భద్రాచలంలో 101 కిలోల డ్రై గంజాయి స్వాధీనం. # వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త ఉన్నత విద్యాసంస్థల బంద్ విజయవంతం.

టేకులపల్లి, ప్రభుత్వ బడిలో చదివి మెరిసిన నందినీ – 507 మార్కులతో ప్రతిభకు నిదర్శనం.

Date : 29 April 2026 07:34 PM Views : 282

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకం ఉంచితేనే ఉత్తమ ఫలితాలు సాధ్యమవుతాయని టేకులపల్లి మండలము బేతంపూడి పంచాయతీ వెంకట్యా తండ కు చెందిన బాణోత్ నందినీ మరోసారి నిరూపించింది. స్థానిక ZPHS టేకులపల్లిలో చదువుతున్న నందినీ పదవ తరగతి పరీక్షల్లో 507 మార్కులు సాధించి ప్రతిభ చాటింది.MPPS వాగొడ్డు తండకు చెందిన ఉపాధ్యాయుడు లక్ష్మా కుమార్తె అయిన నందినీ, మొదటి నుంచీ ప్రభుత్వ పాఠశాలలోనే చదువుకుంటూ ఈ విజయాన్ని సాధించడం విశేషంగా నిలిచింది. పరిమిత వనరుల మధ్యనైనా కృషి, పట్టుదల ఉంటే ఉన్నత ఫలితాలు సాధించవచ్చని ఆమె రుజువు చేసింది.నందినీ ప్రతిభపై పాఠశాల ఉపాధ్యాయులు ఆనందం వ్యక్తం చేస్తూ, ఆమె క్రమశిక్షణ, కష్టపడే తత్వమే ఈ విజయానికి కారణమని తెలిపారు. గ్రామస్తులు, స్నేహితులు నందినీని అభినందిస్తూ ఆమె భవిష్యత్తులో ఇంకా ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు.ఈ సందర్భంగా నందినీ తల్లిదండ్రులు మాట్లాడుతూ,“మేము ప్రభుత్వ బడులపైనే నమ్మకం పెట్టుకున్నాం. మా కూతురు ప్రభుత్వ పాఠశాలలోనే చదివి ఈ స్థాయి మార్కులు సాధించడం మా కుటుంబానికి ఎంతో గర్వకారణం. ఈ ఫలితం రావడం చాలా ఆనందంగా ఉంది” అని తెలిపారు.ప్రస్తుతం ప్రైవేట్ పాఠశాలల వైపు మొగ్గు చూపుతున్న సమయంలో, ప్రభుత్వ బడుల్లోనూ నాణ్యమైన విద్య అందుతుందని నందినీ విజయంతో మరోసారి స్పష్టమైంది. కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా అందుతున్న వసతులు, నాణ్యమైన విద్య మరియు ఇంగ్లీషు మీడియం భోధన ప్రభుత్వ ఉద్యోగులు తమ పిల్లలను ప్రభుత్వ స్కూల్ లోనే చవించాలని ప్రభుత్వ విద్యను బలోపేతం చేయాలని , నాణ్యమైన భోధన బోధించే ఉపాద్యాయులు ఉన్నారని , ఆమె సాధించిన ఈ ఫలితం ఇతర విద్యార్థులకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని ఉపాధ్యాయులు అభిప్రాయపడ్డారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :