Tuesday, 28 July 2026 01:25:09 PM
# విద్యార్థుల ఉసురుతీసిన నీట్ కుంభకోణం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని. # రూ.2 కోట్లతో పూర్తయిన సెంట్రల్ లైటింగ్, టూవే లైన్ రోడ్డులో ప్రారంభించిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # అనంతారం గ్రామంలో రైతు సదస్సు, నీటి సంరక్షణ పై అధికారుల అవగాహన. # బొగ్గు ఉత్పత్తి సాధనలో కార్మికుల సమిష్టి కృషి అభినందనీయం. కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ (జీఎం) షాలెం రాజు. # 16వ డివిజన్లో ప్రారంభమైన తొలిముద్ద - బాల భరోసా చిన్నారులకు తొలిముద్ద ను వడ్డిస్తున్న డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # రేగళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆకస్మిక తనిఖీ. ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # మాదకద్రవ్యాల నియంత్రణపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలి: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ . # కొత్తగూడెం ఏరియా జీఎం షాలెంరాజుకు ఘన వీడ్కోలు. పదవీవిరమణ శుభాకాంక్షలు తెలిపిన ఆర్‌సీహెచ్‌పీ అధికారులు, ఉద్యోగులు, కార్మికులు. # జెన్ జీ నీ తెలంగాణ విద్యాశాఖ మంత్రినీ చేయాలి..జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # సుజాతనగర్ మండల సమగ్ర అభివృద్ధికి నిరంతర కృషి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # శ్రీరాముడు కొలువైన జిల్లాలో పనిచేయటం అదృష్టం -సీనియర్ జర్నలిస్ట్ ఎస్ వి సూర్యనారాయణ. # ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # విత్తన మేళాను రైతులు సద్వినియోగం చేసుకోవాలి : వ్యవసాయ శాఖ అధికారి బాబురావు. # ఉమ్మడి ఖమ్మం జిల్లా సమస్యలపై జనసేన పోరాటం. గడల శ్రీనివాసరావు. # దేశ నిర్మాణంలో యువత భాగస్వామ్యం అత్యంత కీలకం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. # ప్రతి మెడికల్ బోర్డు దరఖాస్తుదారుడికి ఇన్వాలిడేషన్ కల్పించాలి-ఎఐటియుసి నేత మిరియాల రంగయ్య డిమాండ్. # విద్యార్థి పోరాటాలకు తలవంచక తప్పదు. ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వర్క అజిత్. # విద్యార్థుల ఐక్య పోరాట ఫలితమే ధర్మేంద్ర ప్రధాన రాజీనామా. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా # భద్రాచలంలో 101 కిలోల డ్రై గంజాయి స్వాధీనం. # వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త ఉన్నత విద్యాసంస్థల బంద్ విజయవంతం.

జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి కార్యాలయంలో జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులు. కుష్టు వ్యాధిగ్రస్తుల గుర్తింపు ఉద్యమం – 2025

Date : 16 December 2025 09:01 PM Views : 217

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి కార్యాలయంలో జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులు, నోడల్ అధికారులతో కలిసి *“కుష్టు వ్యాధిగ్రస్తుల గుర్తింపు ఉద్యమం – 2025”*పై సమీక్ష సమావేశం మరియు శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ, శరీరంపై రాగి వర్ణంలో లేదా చర్మ రంగుకంటే తక్కువ రంగులో మచ్చలు కనిపించి, ఆ మచ్చలపై స్పర్శ (సెన్సేషన్) లేకపోతే కుష్టు వ్యాధిగా అనుమానించాల్సిందిగా సూచించారు. అటువంటి వ్యక్తులను వెంటనే సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి పంపించి వైద్యాధికారులచే పరీక్షలు నిర్వహించి గుర్తించాలని తెలిపారు.ఈ మచ్చలను నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్తులో అంగవైకల్యం ఏర్పడి కుటుంబానికి భారంగా మారే ప్రమాదం ఉందని, కావున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలియజేశారు. జిల్లా ప్రజలందరూ 14 రోజుల కుష్టు వ్యాధిగ్రస్తుల గుర్తింపు ఉద్యమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ఈ గుర్తింపు ఉద్యమం ఈ నెల 18వ తేదీ నుండి 31వ తేదీ వరకు 14 రోజుల పాటు నిర్వహించబడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి గ్రామంలో ఆశ కార్యకర్తలు ఉదయం 7 గంటల నుండి 9 గంటల వరకు ప్రతి ఇంటిని సందర్శించి ప్రతి వ్యక్తిని పరిశీలించడం జరుగుతుందని, ఈ సర్వేను విజయవంతంగా పూర్తిచేయాలని ఆశ కార్యకర్తలను కోరారు.ప్రస్తుతం జిల్లాలో 45 కుష్టు వ్యాధి కేసులను గుర్తించి వారికి ఉచితంగా మందులు అందించడం జరుగుతోందని తెలిపారు. జిల్లా ఏర్పాటు అయినప్పటి నుండి ఇప్పటివరకు మొత్తం 582 కుష్టు వ్యాధి కేసులను గుర్తించి చికిత్స అందించగా, అందులో 532 మంది పూర్తిగా చికిత్స పొంది ఆరోగ్యవంతులుగా మారారని వివరించారు.ఈ గుర్తింపు ఉద్యమంలో మొత్తం 2,29,336 ఇండ్లను, 1,407 మంది ఆశ కార్యకర్తలు పాల్గొని సందర్శించనున్నారు. గత మార్చి నెలలో నిర్వహించిన కుష్టు వ్యాధిగ్రస్తుల గుర్తింపు ఉద్యమంలో 2,29,336 గృహాలను సందర్శించి 1,702 అనుమానిత కేసులను గుర్తించగా, అందులో 25 మందికి కుష్టు వ్యాధి నిర్ధారణ చేసి చికిత్స అందించడం జరిగింది.గత సంవత్సరాల వారీగా గుర్తించిన కేసుల వివరాలు:2019లో – 62 కేసులు,2022–23లో – 38 కేసులు,2023–24లో – 36 కేసులు, 2024లో – 25 కేసులు ఈ సమావేశంలో డిప్యూటీ డీఎంహెచ్‌వో జయలక్ష్మి గారు మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు విధిగా సమయపాలన పాటించాలని, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోని సిబ్బంది అందరూ అటెండెన్స్ రిజిస్టర్, మూమెంట్ రిజిస్టర్‌లను తప్పనిసరిగా నిర్వహించాలని సూచించారు. అలాగే ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గర్భిణీ స్త్రీల ప్రసవ క్యాలెండర్లను సక్రమంగా నిర్వహిస్తూ, ప్రమాదకర గర్భిణీ స్త్రీలను ముందస్తుగా గుర్తించి అవసరమైతే ఆసుపత్రిలో అడ్మిట్ చేయాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ తుకారం రాథోడ్ ,ఏవో ప్రసాద్, NLEP ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ పుల్లారెడ్డి, బద్రు పీటీ, మోహన్ డీపీఎం, డీపీఓ సరిత, జిల్లా వైద్యాధికారులు, నోడల్ పర్సన్స్ తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :