తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : పాల్వంచ పట్నం వర్తక సంఘం భవనం నుందు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జనసేన పార్టీ ఇంచార్జి వేముల కార్తీక్ ఆధ్వర్యంలో జనసేన కార్యకర్తల ఆత్మీయ సమావేశం జరిగింది.ఈ సమావేశం లో వేముల కార్తీక్ మాట్లాడుతూ పట్టణ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం, అవినీతి రహిత పాలన జనసేన పార్టీతోనే సాధ్యమని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని కార్యకర్తలకు సూచించారు. ప్రతి కార్యకర్త తన వార్డు, బూత్ పరిధిలో ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిని ప్రజలకు స్పష్టంగా వివరించాలన్నారు. అలాగే తెలంగాణలో కూడా అభివృద్ధి జరగాలంటే జనసేనను గెలిపించుకోవాలని గత పాలకుల వైఫల్యాలను ప్రజలకు వివరించి, కొత్తగూడెం భద్రాద్రి జిల్లా మున్సిపాలిటీలలో జనసేన నిజమైన అభివృద్ధి ప్రత్యామ్నాయమని బలంగా చెప్పాలని పిలుపునిచ్చారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మున్సిపాలిటీ ఎన్నికలను జనసేన అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోందని తెలిపారు. ఈ కార్యక్రమానికి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి అత్యధిక సంఖ్యలో కార్యకర్తలు జనసైనికులు వీర మహిళలు హాజరయ్యారు.
Admin
తెలుగు వెలుగు టీవీ