తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జీవితం నేటి తరానికి ఆదర్శంగా నిలవాలని పిసిసి సభ్యులు నాగ సీతారాములు, గ్రంథాలయ చైర్మన్ వీరబాబు అన్నారు. సర్వేపల్లి జన్మదినాన్ని పురస్కరించుకొని స్థానిక జిల్లా కేంద్ర గ్రంథాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అధ్యాపక వృత్తి నుండి మొదలైన ఆయన ప్రస్థానం భారత దేశ ఉప రాష్ట్రపతిగా, రాష్ట్రపతిగా ఎదిగే వరకు సాగిందని, భారత దేశ రాజకీయాల్లో ఆయన చెరగని ముద్ర వేసుకున్నారనీ, అలాంటి విద్యా కోవిధుని జన్మదినాన్ని ఉపాధ్యాయ దినోత్సవం గా జరుపుకుంటామని తెలిపారు. విషయ పరిజ్ఞానం సమయస్ఫూర్తి, వాక్చాతుర్యం అత్యుత్తమ బోధన పరిణితి గల సర్వేపల్లి జీవితం నేటి తరానికి దిక్సూచి కావాలని, యువత ఆయనను ఆదర్శంగా తీసుకొని మంచిగా చదువుకొని ఉన్నత స్థానాలకు చేరుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా ఎందరో విద్యార్థినీ విద్యార్థుల భవిష్యత్తు తీర్చిదిద్దుతూ ఉద్యోగాలు సంపాదించడానికి కృషి చేసిన గ్రంథపాలకురాలు జి మనీ మృదుల ను సన్మానించడం జరిగినది.
Admin
తెలుగు వెలుగు టీవీ