Tuesday, 28 July 2026 12:42:46 PM
# విద్యార్థుల ఉసురుతీసిన నీట్ కుంభకోణం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని. # రూ.2 కోట్లతో పూర్తయిన సెంట్రల్ లైటింగ్, టూవే లైన్ రోడ్డులో ప్రారంభించిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # అనంతారం గ్రామంలో రైతు సదస్సు, నీటి సంరక్షణ పై అధికారుల అవగాహన. # బొగ్గు ఉత్పత్తి సాధనలో కార్మికుల సమిష్టి కృషి అభినందనీయం. కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ (జీఎం) షాలెం రాజు. # 16వ డివిజన్లో ప్రారంభమైన తొలిముద్ద - బాల భరోసా చిన్నారులకు తొలిముద్ద ను వడ్డిస్తున్న డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # రేగళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆకస్మిక తనిఖీ. ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # మాదకద్రవ్యాల నియంత్రణపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలి: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ . # కొత్తగూడెం ఏరియా జీఎం షాలెంరాజుకు ఘన వీడ్కోలు. పదవీవిరమణ శుభాకాంక్షలు తెలిపిన ఆర్‌సీహెచ్‌పీ అధికారులు, ఉద్యోగులు, కార్మికులు. # జెన్ జీ నీ తెలంగాణ విద్యాశాఖ మంత్రినీ చేయాలి..జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # సుజాతనగర్ మండల సమగ్ర అభివృద్ధికి నిరంతర కృషి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # శ్రీరాముడు కొలువైన జిల్లాలో పనిచేయటం అదృష్టం -సీనియర్ జర్నలిస్ట్ ఎస్ వి సూర్యనారాయణ. # ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # విత్తన మేళాను రైతులు సద్వినియోగం చేసుకోవాలి : వ్యవసాయ శాఖ అధికారి బాబురావు. # ఉమ్మడి ఖమ్మం జిల్లా సమస్యలపై జనసేన పోరాటం. గడల శ్రీనివాసరావు. # దేశ నిర్మాణంలో యువత భాగస్వామ్యం అత్యంత కీలకం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. # ప్రతి మెడికల్ బోర్డు దరఖాస్తుదారుడికి ఇన్వాలిడేషన్ కల్పించాలి-ఎఐటియుసి నేత మిరియాల రంగయ్య డిమాండ్. # విద్యార్థి పోరాటాలకు తలవంచక తప్పదు. ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వర్క అజిత్. # విద్యార్థుల ఐక్య పోరాట ఫలితమే ధర్మేంద్ర ప్రధాన రాజీనామా. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా # భద్రాచలంలో 101 కిలోల డ్రై గంజాయి స్వాధీనం. # వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త ఉన్నత విద్యాసంస్థల బంద్ విజయవంతం.

భద్రాద్రిలో వైకుంఠ ద్వార దర్శన మహోత్సవం. ఉత్తర ద్వార దర్శనంతో తరించిన భక్తజనం. వైకుంఠ రాముడిగా అనుగ్రహించిన భద్రాద్రి రామయ్య.

Date : 30 December 2025 07:56 PM Views : 386

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : దక్షిణ అయోధ్యగా ప్రసిద్ధిగాంచిన భద్రాచలంలో ముక్కోటి ఏకాదశి మహోత్సవాలు ఆధ్యాత్మిక వైభవోపేతంగా, భక్తుల హృదయాలను ఉప్పొంగించేలా ఘనంగా నిర్వహించబడ్డాయి. భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో మంగళవారం ముక్కోటి ఏకాదశి సందర్భంగా స్వామివారు ఉత్తర ద్వారం ద్వారా భక్తులకు దర్శనమిచ్చి అనుగ్రహించారు. వైకుంఠ రాముడిగా అలంకరించబడిన స్వామివారి దివ్య దర్శనంతో భక్తులు పరవశించి, శ్రీ రామ జయ రామ జయ జయ రామ అనే జయజయధ్వానాలతో భద్రాద్రి క్షేత్రం మారుమోగింది.ఉత్తర ద్వార దర్శనాన్ని దర్శించుకునేందుకు తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వీవీఐపీ, వీఐపీ సెక్టార్లతో పాటు సాధారణ భక్తుల కోసం ఏర్పాటు చేసిన వివిధ సెక్టార్లలో భక్తులు శాంతియుతంగా వేడుకలను తిలకించారు. వేదపండితులు, స్థానాచార్యులు ముక్కోటి ఏకాదశి విశిష్టతను వివరించగా, అర్చకులు 108 ఒత్తులతో మహా హారతి నిర్వహించారు. అనంతరం ఉత్తర ద్వారం ద్వారా దర్శనం అనంతరం ఉత్సవ మూర్తులను మాడ వీధుల్లో భక్తిశ్రద్ధల మధ్య ఊరేగించారు.ఈ సందర్భంగా స్వామివారు గరుడ వాహనరూపుడిగా శ్రీమహావిష్ణువు అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అర్చకులు విశేష ఆరాధనలు, శ్రీరామ పదాక్షరీ మంత్ర సంపుటిత అష్టోత్తర శతనామార్చన, చతుర్వేద పఠనం, గరుడ ప్రబంధాలు, ఇతిహాస పఠనం, శరణాగతి గజ్జగరుడ దండం, భక్తరామదాసు రచించిన దాశరథి శతక పఠనం నిర్వహించారు. వైకుంఠ రాముడికి అష్టోత్తర శత హారతిని భక్తిశ్రద్ధలతో సమర్పించారు. భక్తరామదాసు కాలం నుంచీ కొనసాగుతున్న సంప్రదాయం ప్రకారం భద్రాచలం తహసీల్దార్ శ్రీనివాస్ మూలవిరాట్టులకు స్నపన కార్యక్రమం నిర్వహించారు.ఉత్తర ద్వార దర్శనం అనంతరం వైకుంఠరాముడు తిరువీధి సేవకు బయలుదేరారు. చలువ చప్పర వాహనంపై పెరియాళ్వార్, నమ్మాళ్వార్, మరో వాహనంపై అండాళ్ అమ్మవారు, హనుమత్ వాహనంపై లక్ష్మణస్వామి, గజవాహనంపై సీతమ్మవారు, గరుడ వాహనంపై శ్రీ సీతారామచంద్రమూర్తుల తిరువీధి సేవ మేళతాళాలు, భాజా భజంత్రీలు, వేద మంత్రోచ్చారణల మధ్య శోభాయమానంగా సాగింది. రాపత్తు ఉత్సవాలతో వేడుకలు మరింత వైభవాన్ని సంతరించుకున్నాయి.భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఎప్పటికప్పుడు యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తూ, ప్రతి సెక్టార్‌లో ఏర్పాట్ల పర్యవేక్షణకు జిల్లా అధికారులు, లైజన్ అధికారులను నియమించారు. బందోబస్తు ఏర్పాట్లను జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ స్వయంగా పర్యవేక్షించారు. ఈ వేడుకకు భద్రాచలం, శాసనసభ్యులు డాక్టర్ తెల్లం వెంకట్ రావు, పినపాక శాసన సభ్యులు పాయం వెంకటేశ్వర్లు, భద్రాచలం సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠ, ఐ టి డి ఏ పి ఓ రాహుల్, ట్రైనీ కలెక్టర్ సొరబ్ శర్మ, అదనపు కలెక్టర్ వేణుగోపాల్ ఏఎస్పీ విక్రాంత్ సింగ్, దేవస్థానం ఈఓ దామోదర్ రావు, భద్రాచలం సర్పంచ్ పూనం కృష్ణ దొర తదితర ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరై స్వామివారి దర్శనం చేసుకున్నారు.వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు విజయవంతం – జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్. సీతారామచంద్రస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో, అన్ని శాఖల అధికారుల సమన్వయంతో నిర్వహించిన ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు, ఉత్తర ద్వార దర్శనం కార్యక్రమాలు విజయవంతంగా పూర్తయ్యాయని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ తెలిపారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా సమర్థవంతమైన ఏర్పాట్లు చేయగలిగామని తెలిపారు. ఈ ఉత్సవాల నిర్వహణలో సహకరించిన జిల్లా యంత్రాంగానికి, భక్తులకు, పాత్రికేయులకు ఆయన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :