తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం మార్చి 26 తెలుగు వెలుగు) : * డీఎంఎఫ్ నిధులు చెల్లించి భూమి కొనుగోలు చేసి ఇవ్వొచ్చు * జర్నలిస్టుల నిరసన దీక్షలో పాల్గొన్న అమరుల కుటుంబాలు * ఏడవ రోజుకు చేరుకున్న నిరసన కార్యక్రమం జర్నలిస్టులు తమ ఇండ్ల సాధన కోసం చేస్తున్న నిరసన న్యాయమైనదని సింగరేణి రిటైర్డ్ జిఎం ఎ. ఆనందరావు అన్నారు. కోడి కుయకముందే సమాజాన్ని మేల్కొలి, ఎక్కడ ఏ సంఘటన జరిగిన తక్షణమే వార్త ప్రపంచానికి చాటిచెప్పే జర్నలిస్టులు దశాబ్ద కాలంగా ఇండ్ల స్థలం కోసం ఎదురుచూస్తున్నారని వారి కోరికను వెంటనే తీర్చాలని ప్రభుత్వాన్ని కోరారు. సామాజిక వేత్త, యువ నాయకులు బండి విజయ భాస్కర్ నిరసన కార్యక్రమానికి సంఘీభావం తెలిపి మద్దతు ప్రకటించి మాట్లాడారు. రాజకీయ నాయకులు ప్రతిపక్షంలో వున్నప్పుడు జర్నలిస్టులకు ఆనేక హామీలు ఇచ్చి గద్దెనెక్కిన తర్వాత హామీలను విస్మరించడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. డిఎంఎఫ్ నిధులతో పట్టణంలో రోడ్డు మీదే రోడ్డు వేస్తూ నిధులను దుర్వినియోగం చేస్తున్నారని, ఆ నిధులతో జర్నలిస్టు లకు ప్రభుత్వం కేటాయించిన ఇండ్ల స్థలాలకు మానవత్వంతో నగదు చెల్లించి కొనుగోలు చేసి ఇవ్వవొచ్చని చెప్పారు.
ఇప్పటికైనా ప్రభుత్వం జర్నలిస్టు ల న్యాయమైన డిమాండ్ ను తేర్చాలన్నారు. పర్యావరణ ప్రేమికుడు మొక్కల రాజశేఖర్ నిరసన శిబిరాన్ని సందర్శించి మద్దతు తెలిపి మాట్లాడారు. మొక్కల రాజశేఖర్ గా నన్ను ప్రపంచానికి పరిచయం చేసిందే మీడియా సోదరులని, అలాంటి మీడియా మిత్రులు తమ సమస్యల కోసం నిరసన చేపట్టడం ఎంతో బాధాకరమని అన్నారు. మీడియా వల్లే నాకు ప్రధాని మోడీ తో మాట్లాడే అవకాశం వచ్చిందని గుర్తు చేశారు. వెంటనే ప్రభుత్వం స్పందించాలని. కోరారు. ఏడవ రోజు దీక్షలో జర్నలిజం వృత్తి చేస్తూ మరణించిన కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. వారు ప్రభుత్వానికి మాకు స్థలం ఇచ్చి మా కుటుంబాలను ఆదుకోవాలి వేడుకొన్నారు. ఈ సందర్భంగా తొలుత అమరులైన వారికి రెండు నిమిషాలు మౌనం పాటించి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వివిధ పత్రికల, ఛానెళ్ల రిపోర్టర్లు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ