తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జూలూరుపాడుమండలం అనంతారం గ్రామానికి చెందిన గిరిజన రైతులు మాకు ప్రభుత్వం నుండి పోడు భూముల పట్టాలు లభించాయి. మేము ఆ భూములను నమ్ముకుని వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాము.ప్రస్తుతం మా పోడు భూములకు నీటి సౌకర్యం లేకపోవడం వలన వర్షాధారిత పంటలపైనే ఆధారపడాల్సి వస్తోంది. బోర్ వ్యవసాయ మోటర్లు, విద్యుత్ కనెక్షన్ ఇప్పించగలరని గ్రామ సర్పంచ్ కోర్సా రమేష్ ద్వారా జూలూరుపాడు అభివృద్ధి అధికారి తాళ్లూరి రవి కు వినతి పత్రం అందించారు. కోర్సా రమేష్ మాట్లాడుతూ విద్యుత్ సౌకర్యం కల్పిస్తే ఏడాది పొడవునా పంటలు పండించుకుని ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది కనుక తక్షణమే ఐటీడీఏ ద్వారా వ్యవసాయ బోర్లు వేయించి విద్యుత్ కనెక్షన్లు అందించి గిరిజన ఆదివాసిల అభివృద్ధికి తోడ్పాటు అందించాలన్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ