తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : తేదీ.10.03.2026 నాడు కొమ్ముగూడెం గ్రామంలో ఆయిల్ పామ్ అవగాహన మరియు సాగు ప్రోత్సాహక కార్యక్రమం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో గుండాల మండలం కొమ్ముగూడెం గ్రామంలో ఆయిల్ పామ్ పంటపై అవగాహన మరియు సాగు ప్రోత్సాహక కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో ఉద్యాన శాఖ అధికారులు రైతులకు ఆయిల్ పామ్ పంట ప్రాధాన్యత, సాగు విధానం, అధిక దిగుబడులు పొందే పద్ధతులు మరియు ప్రభుత్వ ప్రోత్సాహకాల గురించి వివరించారు. ఆయిల్ పామ్ పంట సాగు ద్వారా రైతులు దీర్ఘకాలికంగా మంచి ఆదాయం పొందవచ్చని తెలిపారు. అలాగే మొక్కల నాటడం నుంచి పంట కోత వరకు పాటించాల్సిన పద్ధతులు, నీటి నిర్వహణ, ఎరువుల వినియోగం మరియు పంట సంరక్షణ గురించి రైతులకు అవగాహన కల్పించారు. ప్రస్తుతం మార్కెట్ లో డిమాండ్ ఉన్న బొప్పాయి, అరటి, తీగజాతి కూరగాయలు, ఆకుకూరలు, పూలు, తైవాన్ జామ, నిమ్మ, కరివేపాకు, బోడ కాకర, తీగ చిక్కుడు, మునగ, నేరేడు, సీతాఫలం, డ్రాగన్ ప్రూట్, కోకో, వక్క, జాజికాయ తదితర పంటలను నూతన రకాలతో సాగుచేపట్టి ఎకరానికి నికరంగా లక్ష రూపాయల ఆదాయం పొందవచ్చును. కొమ్ముగూడెం గ్రామానికి చెందిన రైతులు అధిక సంఖ్యలో పాల్గొని తమ సందేహాలను అధికారులతో అడిగి తెలుసుకున్నారు. రైతులు ఆయిల్ పామ్ సాగును విస్తరించి ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను పొందాలని అధికారులు సూచించారు. ఈ కార్యక్రమంలో కొమ్ముగూడెం గ్రామ సర్పంచ్ శ్రీమతి కల్టి కృష్ణవేణి, జిల్లా ఉద్యాన & పట్టుపరిశ్రమ శాఖ అధికారి శ్రీ జంగ కిషోర్, ఉద్యాన అధికారి శ్రీ డి. దేవప్రసాద్ ఆయిల్ఫైడ్ ప్రతినిధి, శ్రీ ఎస్. శంకర్, వికాష్, ఉపేందర్, కోరమండల్ సంస్థ ఉద్యోగులు, ఉద్యానవన శాఖ సిబ్బంది, ఇతర శాఖల సంబంధిత అధికారులు మరియు గ్రామ రైతులు పాల్గొన్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ