తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : మెడికల్ బోర్డు నిర్వహించాలని టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో కాపుకృష్ణ ముఖ్య ప్రధాన కార్యదర్శి అన్ని మైన్స్ డిపార్ట్మెంట్స్ మీద నల్ల బ్యాడ్జీ ధరించి నిరసన తెలియజేసి మెమొరండం ఇవ్వడం జరిగింది. జూలై , నవంబర్ నెలలో అర్హత కలిగి అన్ఫిట్ చేయని కార్మికులకు తిరిగి మెడికల్ బోర్డు నిర్వహించాలి.విజిలెన్స్ లో ఉన్న మారుపేరుల సమస్యను వెంటనే పరిష్కరించాలి. AITUC, INTUC కార్మిక సంఘాలు, కార్మికులకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను తక్షణమే నెరవేర్చాలి. గత సంవత్సర కాలంగా మెడికల్ బోర్డు కోసం ఎదురుచూస్తున రెండు వేలకు పైగా కార్మికులన్యాయం చేయాలి. సింగరేణి యాజమాన్యం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలు మానుకోవాలి . వీకే కోల్ మైన్ ను సింగరేణి యంత్రాలతో సింగరేణి ఉద్యోగులతో బొగ్గు వెలికి తీయాలి. కొత్తగూడెం ఏరియా లో సర్పస్ లో ఉన్న కాళిలను పీవీకే అండర్ గ్రౌండ్ కార్మికుల తో పరదర్శకంగా ఎటువంటి పైరవీలు లేకుండా నింపాలి. ఈ రోజు కొత్తగూడెం ఏరియా వ్యాప్తంగా అన్ని గనులు, డిపార్ట్మెంట్లలో TBGKS వైస్ ప్రెసిడెంట్ గడప రాజయ్య ఆధ్వర్యంలో చీఫ్ జనరల్ సెక్రెటరీ కాపుకృష్ణ పాల్గొని గనిలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపి గని మేనేజర్లకు మరియు డిపార్ట్మెంట్ హెడ్ లకు వినతి పత్రం అందించడం జరిగింది. ఈ కార్యక్రమం లో బోరింగ్ శంకర్, గిన్నారపు మహేందర్, నేమిళ్ల వెంకటేశ్వర్లు, రాజకుమార్, కృష్ణయ్య, వెంకట్, విజయ్ కుమార్,జిమ్మిడి అనుదీప్, రాజేశ్వరరావు, బాలాజీ, గడప రాజేష్, అన్వర్ పాషా, సుధాకర్ ఉద్యోగస్థులు తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ