తెలుగు వెలుగు టీవీ - వార్తలు / జూలూరుపాడు : భద్రాద్రి కొత్తగూడెంఏప్రిల్ 28 (తెలుగు వెలుగు) : జూలూరుపాడు విద్యార్థిని అభినందించిన సీఐ ఇంద్రసేనారెడ్డి .పిల్లల బంగారు భవిష్యత్తే తల్లిదండ్రుల లక్ష్యం. ఇందుకోసం నిరంతరం శ్రమిస్తుంటారు. రోజురోజుకూ ఆంగ్ల మాధ్యమానికి ఆదరణ పెరుగుతుండటంతో ఆ దిశగా చదివించాలని ఆశపడుతుంటారు. ఇందుకు చక్కటి వేదికగా నిలుస్తోంది జూలూరుపాడులోని సాయి ఎక్సలెంట్ స్కూల్ ఇక్కడ నిరుపేదల విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్య అందుతోంది. అన్ని సదుపాయాలు కలిస్తూ ఆంగ్ల మాధ్యమంలో బోధన చేస్తున్నారు. విద్య తోపాటు అన్నీ సదుపాయాలు ఉన్నాయి. జూలూరుపాడు మండలం కేంద్రంలోని పాపకొల్లు రోడ్డు నందు కలిగిన సాయి ఎక్సలెంట్ స్కూల్ లో బోడ. ప్రజ్ఞ తేజ అనే విద్యార్థి ఏకలవ్య సీటు సాధించడం జరిగినది. ఈ సందర్భంగా సిఐ ఇంద్ర సేనా రెడ్డి బి. ప్రజ్ఞ తేజని మరియు తల్లిదండ్రులైన బి.కృష్ణని అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాయి ఎక్సలెంట్ స్కూల్ లో నవోదయ , గురుకులం, మరియు ఏకలవ్య లో సీట్లు అత్యధిక స్థాయిలో సీట్లు సాధించినందుకు స్కూల్ మేనేజ్మెంట్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా డైరెక్టర్.హుస్సేన్ మాట్లాడుతూ సాధారణ విద్యార్థులతో అసాధారణ ఫలితాలు సాధిస్తూ,జిల్లా స్థాయిలో పేరు గడించినందుకు విద్యార్థి ,విద్యారినిలుకు,మరియు తల్లిదండ్రులకు, ముఖ్యంగా ఉపాధ్యాయ, ఉపాధ్యాయులకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ కృష్ణ ప్రసాద్ మరియు నాగరాజు అభినందనలు తెలియజేశారు.
Admin
తెలుగు వెలుగు టీవీ