తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భూమి కోసం, భుక్తి కోసం,వెట్టి చాకిరి విముక్తి కోసం పోరాడిన వీరనారి చాకలి ఐలమ్మ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అన్నారు. శుక్రవారం చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా ఐ డి ఓ సి కార్యాలయం సమావేశ మందిరంలో జిల్లా వెనకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్ ఐలమ్మ చిత్రపటానికి పూల మాలలు వేసి, జ్యోతి ప్రజ్వలన చేసి నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఉద్యమించారని చెప్పారు. ఇలాంటి మహానీయుల చరిత్రను భావితరాలకు అందించి వారి ఆశయాలకు అనుగుణంగా అందరు సమిష్టిగా పని చేయాలని అన్నారు.1940-44 మధ్య కాలంలో విస్నూర్లో దేశ్ముఖ్, రజాకార్ల ఆరాచకాలపై ఎదురు తిరిగి పోరాట యోధురాలు ఐలమ్మ అని, తెలంగాణ రైతాంగ పోరాటంలో నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేసి మహిళల్లో స్ఫూర్తిని నింపిన వీర వనిత అని కొనియాడారు. చాకలి ఐలమ్మ చేసిన పోరాటాలను గుర్తుచేస్తూ వారి ఆశయాలను మనం పూర్తిగా సాధించేందుకు కృషి చేయాలని, తద్వారా సమాజాభివృద్ధికి తోడ్పడినట్లు అవుతుందని అన్నారు. వారి పోరాటాలు, ఆశయాలు అందరికి తెలియాలని రాష్ట్ర ప్రభుత్వం వారి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నదని తెలిపారు.ఈ కార్యాక్రమంలో పి. విజయలక్ష్మీ జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ అధికారి, జిల్లా అధికారులు మరియు బి.సి.సంఘ నాయకులు నేరెళ్ళ రమేష్ , అజిత్ కుమార్ , సర్వేశ్ , కె. వసంత రావు , బి. శ్రీనివాస్ , ఆర్. వెంకటయ్య , ఎం. బిక్షం , బి. జయమ్మ , కొదుమురి సత్యనారాయణ మరియు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ