తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : క్షయ రైత సమాజాన్ని నెలకొల్పడమే ఏకైక లక్ష్యంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ మరియు డిఎం అండ్ హెచ్ ఓ ఆదేశాల మేరకు రామవరం పిహెచ్సి ఆధ్వర్యంలో చిట్టి రామవరం లో క్షయ వ్యాధిగ్రస్తుల ఎక్స్రే కార్యక్రమం విజయవంతమైంది. ఈ సందర్భంగా చిట్టి రామవరం బస్తీ దావకానలో ఏర్పాటు చేసిన ఎక్సరే కార్యక్రమంలో డాక్టర్ E రాము ,మాజీ 11వ వార్డ్ కౌన్సిలర్ భూక్య శ్రీనివాసులు పాల్గొని మాట్లాడుతూ క్షయ రైత సమాజాన్ని నెలకొల్పాలనే ఏకై లక్ష్యం తో కలెక్టర్ తీసుకున్న ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ప్రజలందరూ పూలుకోవాలని వారి విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా సుమారు 150 మందికి ఎక్స్రేలు తీసి అలాగే తెమడ పరీక్షల కోసం వారి శాంపిల్స్ తీసుకోవడం జరిగిందని వారు తెలిపారు. రోగ నిర్ధారణ అనంతరం వారికి ఉచిత మందులు పంపిణీ చేశారు. అలాగే జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాలలో, మారుమూల పల్లెల్లో కూడా క్షయ ఎక్సరే, తెమడ పరీక్షలు నిర్వహించి క్షయ నివారణకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఈ సందర్భంగా వారు తెలిపారు ఈ కార్యక్రమంలో డాక్టర్ అజయ్, పబ్లిక్ హెల్త్ మేనేజర్ వి శ్రీనివాసరావు, కృష్ణవేణి, రఫెల్, ఎక్స్రే టెక్నీషియన్ సాయికుమార్, ఏఎన్ఎంలు k.కవిత, B.తార, P. శ్రీలక్ష్మి, వరకుమారి అంగన్వాడీ టీచర్స్ శ్రీదేవి, తులసి, రమాదేవి, సరోజిని, భవాని (ఆశ), T.రాజమణి తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ