Tuesday, 28 July 2026 10:45:29 AM
# విద్యార్థుల ఉసురుతీసిన నీట్ కుంభకోణం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని. # రూ.2 కోట్లతో పూర్తయిన సెంట్రల్ లైటింగ్, టూవే లైన్ రోడ్డులో ప్రారంభించిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # అనంతారం గ్రామంలో రైతు సదస్సు, నీటి సంరక్షణ పై అధికారుల అవగాహన. # బొగ్గు ఉత్పత్తి సాధనలో కార్మికుల సమిష్టి కృషి అభినందనీయం. కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ (జీఎం) షాలెం రాజు. # 16వ డివిజన్లో ప్రారంభమైన తొలిముద్ద - బాల భరోసా చిన్నారులకు తొలిముద్ద ను వడ్డిస్తున్న డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # రేగళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆకస్మిక తనిఖీ. ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # మాదకద్రవ్యాల నియంత్రణపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలి: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ . # కొత్తగూడెం ఏరియా జీఎం షాలెంరాజుకు ఘన వీడ్కోలు. పదవీవిరమణ శుభాకాంక్షలు తెలిపిన ఆర్‌సీహెచ్‌పీ అధికారులు, ఉద్యోగులు, కార్మికులు. # జెన్ జీ నీ తెలంగాణ విద్యాశాఖ మంత్రినీ చేయాలి..జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # సుజాతనగర్ మండల సమగ్ర అభివృద్ధికి నిరంతర కృషి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # శ్రీరాముడు కొలువైన జిల్లాలో పనిచేయటం అదృష్టం -సీనియర్ జర్నలిస్ట్ ఎస్ వి సూర్యనారాయణ. # ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # విత్తన మేళాను రైతులు సద్వినియోగం చేసుకోవాలి : వ్యవసాయ శాఖ అధికారి బాబురావు. # ఉమ్మడి ఖమ్మం జిల్లా సమస్యలపై జనసేన పోరాటం. గడల శ్రీనివాసరావు. # దేశ నిర్మాణంలో యువత భాగస్వామ్యం అత్యంత కీలకం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. # ప్రతి మెడికల్ బోర్డు దరఖాస్తుదారుడికి ఇన్వాలిడేషన్ కల్పించాలి-ఎఐటియుసి నేత మిరియాల రంగయ్య డిమాండ్. # విద్యార్థి పోరాటాలకు తలవంచక తప్పదు. ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వర్క అజిత్. # విద్యార్థుల ఐక్య పోరాట ఫలితమే ధర్మేంద్ర ప్రధాన రాజీనామా. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా # భద్రాచలంలో 101 కిలోల డ్రై గంజాయి స్వాధీనం. # వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త ఉన్నత విద్యాసంస్థల బంద్ విజయవంతం.

సీఎం పర్యటన ఏర్పాట్లు త్వరితగతిన పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్

Date : 28 November 2025 03:38 PM Views : 247

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : డిసెంబర్ 2న భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఎర్త్ సైన్స్ యూనివర్సిటీ ప్రారంభోత్సవ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి విచ్చేయనున్న నేపథ్యంలో పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లన్నీ శుక్రవారం జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ సమగ్రంగా పరిశీలించి త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. ఈ పరిశీలనలో భాగంగా కలెక్టర్ విశ్వవిద్యాలయంలో ని అన్ని విభాగాలను సంబంధిత శాఖల ఇంజనీరింగ్, రోడ్లు-భవనాలు, విద్యుత్, పోలీస్ శాఖ, మున్సిపల్ అధికారులతో కలిసి పరిశీలించారు. ముఖ్యమంత్రి పర్యటనలో చేపట్టాల్సిన ఏర్పాట్లు, పనుల పురోగతి, భద్రతా చర్యలు, నిర్వహణ వంటి అంశాలపై అధికారుల నుండి వివరణలు కోరారు. శిలాఫలకం ఏర్పాటు, ఆవరణ అభివృద్ధి, అంతర్గత రోడ్ల మరమ్మత్తులు, సందర్శకుల కోసం ఏర్పాటు చేయాల్సిన మార్గదర్శక బోర్డులు, పార్కింగ్ స్థలాలు, స్టేజీ నిర్మాణం, విద్యుత్ సౌకర్యాల తనిఖీ వంటి అంశాలను స్వయంగా పరిశీలించిన కలెక్టర్, లోటుపాట్లు ఏవైనా ఉన్న వెంటనే సరిదిద్దాలని అధికారులకు ఆదేశించారు. కలెక్టర్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి పర్యటన అత్యంత ప్రాధాన్యత కలిగినది అని, అన్ని శాఖలు పరస్పర సమన్వయంతో పనిచేసి, పనులను వేగవంతంగా పూర్తి చేయాలి. విశ్వవిద్యాలయం సుందరీకరణలో భాగంగా మొక్కలు నాటడం, ప్రాంగణ పరిశుభ్రత, తాగునీటి సౌకర్యాలు, శానిటేషన్ ఏర్పాట్లు పూర్తి చేసి, ముఖ్యమంత్రి పర్యటన నాటికి ప్రమాణాలకు అనుగుణంగా ఉండేలా చూడాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు. పర్యటన రూట్‌మ్యాప్ తుది రూపు, ట్రాఫిక్ సర్దుబాట్లు, అగ్నిమాపక చర్యలు, వైద్య బృందాల నియామకం, వీఐపి ప్రోటోకాల్ అమలు, వంటి అంశాలపై కూడా కలెక్టర్ ప్రత్యేక సూచనలు చేశారు. ఈ పరిశీలనలో కలెక్టర్ వెంట ఎర్త్ సైన్స్ యూనివర్సిటీ ప్రిన్సిపల్ డాక్టర్ జగన్మోహన్ రాజు, మున్సిపల్ కమిషనర్ సుజాత, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :