తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం ఏప్రిల్ 23 తెలుగు వెలుగు) జూలూరుపాడు సబ్ ఇన్స్పెక్టర్ రవి మాట్లాడుతూ వేసవి సెలవులు వచ్చిన సందర్భముగా పిల్లలపై తల్లిదండ్రులు ప్రత్యేకంగా దృష్టి పెట్టాలన్నారు. ముఖ్యంగా చెరువులు, మరియు కాలువల దగ్గరకు ఈతల కోసమని పిల్లలను పంపించవద్దని. పిల్లలు ఎటు వెళుతున్నారు ఏం చేస్తున్నారనేది గమనించాలన్నారు. మైనర్ పిల్లలకు టూ వీలర్స్ ఇవ్వొద్దని, ఎలక్ట్రికల్ వస్తువులకు సాధ్యమైనంత వరకు దూరంగా ఉంచండి. మిట్ట మధ్యాహ్నం ఎండలు ఎక్కువగా ఉన్న సమయంలో బయటకు వెళ్లనివ్వకండి, వడదెబ్బ తగిలే ప్రమాదం ఉంటుంది. పిల్లలు మానసికంగా ఉల్లాసంగా ఉండటం కొరకు సాయంత్రం పూట రెండు గంటలు వారితో సరదాగా , సంతోషంగా గడపడానికి ప్రయత్నించండి. మీరు పని బిజీలో ఉండి పట్టించుకోకపోతే పిల్లలకు ఏదైనా ప్రమాదాలు జరిగిన తర్వాత రాదు కనుక మీ పిల్లల భవిష్యత్తు మి పైనే ఆధారపడి ఉంటుంది. హాలిడేస్ అంతా సరదాగా సాగిపోవాలని మీ ఎస్ఐ రవి
Admin
తెలుగు వెలుగు టీవీ