Tuesday, 28 July 2026 04:48:44 PM
# విద్యార్థుల ఉసురుతీసిన నీట్ కుంభకోణం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని. # రూ.2 కోట్లతో పూర్తయిన సెంట్రల్ లైటింగ్, టూవే లైన్ రోడ్డులో ప్రారంభించిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # అనంతారం గ్రామంలో రైతు సదస్సు, నీటి సంరక్షణ పై అధికారుల అవగాహన. # బొగ్గు ఉత్పత్తి సాధనలో కార్మికుల సమిష్టి కృషి అభినందనీయం. కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ (జీఎం) షాలెం రాజు. # 16వ డివిజన్లో ప్రారంభమైన తొలిముద్ద - బాల భరోసా చిన్నారులకు తొలిముద్ద ను వడ్డిస్తున్న డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # రేగళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆకస్మిక తనిఖీ. ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # మాదకద్రవ్యాల నియంత్రణపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలి: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ . # కొత్తగూడెం ఏరియా జీఎం షాలెంరాజుకు ఘన వీడ్కోలు. పదవీవిరమణ శుభాకాంక్షలు తెలిపిన ఆర్‌సీహెచ్‌పీ అధికారులు, ఉద్యోగులు, కార్మికులు. # జెన్ జీ నీ తెలంగాణ విద్యాశాఖ మంత్రినీ చేయాలి..జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # సుజాతనగర్ మండల సమగ్ర అభివృద్ధికి నిరంతర కృషి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # శ్రీరాముడు కొలువైన జిల్లాలో పనిచేయటం అదృష్టం -సీనియర్ జర్నలిస్ట్ ఎస్ వి సూర్యనారాయణ. # ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # విత్తన మేళాను రైతులు సద్వినియోగం చేసుకోవాలి : వ్యవసాయ శాఖ అధికారి బాబురావు. # ఉమ్మడి ఖమ్మం జిల్లా సమస్యలపై జనసేన పోరాటం. గడల శ్రీనివాసరావు. # దేశ నిర్మాణంలో యువత భాగస్వామ్యం అత్యంత కీలకం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. # ప్రతి మెడికల్ బోర్డు దరఖాస్తుదారుడికి ఇన్వాలిడేషన్ కల్పించాలి-ఎఐటియుసి నేత మిరియాల రంగయ్య డిమాండ్. # విద్యార్థి పోరాటాలకు తలవంచక తప్పదు. ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వర్క అజిత్. # విద్యార్థుల ఐక్య పోరాట ఫలితమే ధర్మేంద్ర ప్రధాన రాజీనామా. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా # భద్రాచలంలో 101 కిలోల డ్రై గంజాయి స్వాధీనం. # వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త ఉన్నత విద్యాసంస్థల బంద్ విజయవంతం.

*విద్యతోనే భవిష్యత్తు బాగుంటుంది. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆకస్మిక తనిఖీలో జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్.

Date : 19 February 2025 07:47 PM Views : 836

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : విద్యతోనే భవిష్యత్తు బాగుంటుందని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. బుధవారం లక్ష్మీదేవి పల్లి మండలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీలో భాగంగా పాఠశాలలోని పదవ తరగతి గదిలో విద్యార్థులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కృషి,పట్టుదల క్రమశిక్షణతో పదవ తరగతిలో విజయం సాధించి భవిష్యత్తులో ఏం చదవాలి అనే లక్ష్యాన్ని ఏర్పరచుకొని ఆ దిశగా ముందుకు వెళ్లాలని విద్యార్థులకు సూచించారు.తల్లిదండ్రులు ఎన్నో ఆశలు పెట్టు కుని తమ పిల్లలు బాగా చదవాలని పాఠశాలలకు పంపు తుంటారని విద్యార్థులు తమ తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చే విధంగా బాగా చదివి ఉన్నత శిఖరాలను అవరోధించాలన్నారు . భవిష్యత్తులో ఏమి చదువుతారని, ఏ గ్రూపు తీసుకుంటారని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. కష్టపడి చదివే విద్యతోనే భవిష్యత్తు బాగుంటుందని తెలిపారు. పరీక్షలకు కొన్ని రోజుల సమయం ఉన్నందున సమయాన్ని వృధా చేయకుండా చదవాలన్నారు. పరీక్ష సమయంలో ఒత్తిడికి గురి కాకుండా ఏదైనా సందేహాలు ఉంటే ఉపాధ్యాయులు అడిగి నివృత్తి చేసుకోవాలని సూచించారు. ఉపాధ్యాయులు ప్రతి ఒక్క విద్యార్థి మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకొని 100% ఉత్తీర్ణత కు కృషి చేయాలని ఆదేశించారు. అనంతరం తొమ్మిదవ తరగతి గదిలో విద్యార్థులతో మమేకమై వారికి మెనూ ప్రకారం భోజనం అందుతుందా, ఉపాధ్యాయులు పాఠాలు ఎలా చెబుతున్నారు అని ఆరా తీశారు. పాఠశాలలో ఏర్పాటుచేసిన ఫేషియల్ రికగ్నైజేషన్ సిస్టం (FRS) లో హాజరును ఎలా నమోదు చేస్తున్నారు అని అధికారులు అడిగి, ప్రతిరోజు నమోదు కచ్చితంగా చేయాలని, ఆపార్ నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. వంట గదిలో రాళ్ల పొయ్యి మీద వంట వండటానికి గమనించిన కలెక్టర్ రాళ్ళకు బదులు ఐరన్ తో చేసిన పొయ్యిలను ఉపయోగించాలని సూచించారు. పాఠశాల ఆవరణలో నాటిన మొక్కలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. మునగ మరియు కరివేపాకు ను వంటలలో ఉపయోగిస్తున్నారా అని అధికారులను అడిగి, విద్యార్థులకు ఆహారంలో వీటిని ఉపయోగించడం ద్వారా విద్యార్థుల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని కాబట్టి వంటలో ఉపయోగించాలని సూచించారు. ఈ సందర్భంగా పాఠశాల సిబ్బంది పాఠశాలలో సైన్స్ ల్యాబ్ నిర్మాణం మరియు రెండు బిల్డింగుల మధ్య రేకుల షెడ్డు నిర్మాణం ఆవశ్యకతను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. స్థానిక ఎంఈఓ ద్వారా సైన్స్ ల్యాబ్ మరియు రేకుల షెడ్డు నిర్మాణానికి ప్రణాళికలు రూపొందించి నివేదిక సమర్పించాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ తనిఖీలో కలెక్టర్ వెంట పాఠశాల ప్రధానోపాధ్యాయులు కొండలరావు, ఎంపీడీవో చలపతి, గ్రామ పంచాయతీ సెక్రెటరీ సాంబయ్య మరియు పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :